Movie News

ఇంకా చల్లారని ఆదిపురుష్ మంటలు

ఆదిపురుష్ సినిమా రిలీజై తొమ్మిది నెలలు కావస్తోంది. ఇంకా ఆ సినిమా తాలూకు వివాదాలు చల్లారట్లేదు. దానిపై విమర్శలు ఆగట్లేదు. రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని భ్రష్టు పట్టించారంటూ ఓం రౌత్ అండ్ టీం మీద రిలీజ్ టైంలో ఎంతగా విమర్శలు వచ్చాయో తెలిసిందే. ఎంత మామూలుగా తీసినా ప్రేక్షకులను మెప్పించే అవకాశమున్న కథను.. ఓం రౌత్ తెరపై ప్రెజెంట్ చేసిన తీరు జనాలకు కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ముఖ్య పాత్రధారుల అవతారాలు, డైలాగులు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తేడా కొట్టేశాయి ‘ఆదిపురుష్’లో.

ఓవైపు రామ పారాయణం జరిగిన ప్రతి చోటుకీ హనుమంతుడు వస్తాడంటూ థియేటర్లలో ఒక సీట్ ఖాళీగా వదిలిపెట్టడం లాంటి ప్రమోషన్ చేసి.. అసలిది రామాయణ కథే కాదు అంటూ ‘ఆదిపురుష్’ రైటర్ పేర్కొనడం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. హనుమాన్ లాంటి సినిమాల్లో వీఎఫెక్స్, హనుమంతుడి పాత్ర ప్రెజెంటేషన్ చూశాక ‘ఆదిపురుష్’ టీం మీద జనాలకు మరింత ఆగ్రహం కలిగింది.

ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారీ ‘ఆదిపురుష్’ టీంకు విమర్శల సెగ తప్పట్లేదు. తాజాగా సీనియర్ నటుడు విందు దారాసింగ్.. ‘ఆదిపురుష్’ టీం మీద ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించాడు. ‘ఆదిపురుష్’ను అతి పెద్ద మిస్టేక్‌గా పేర్కొన్న విందు.. ఒక గొప్ప కథ విషయంలో ఎంతో బాధ్యతగా ఉండాల్సిన టీం తామేదో అద్భుతం చేస్తున్నామన్న భావనతో బాధ్యతారాహిత్యంగా ఈ సినిమా తీసిందని అతను విమర్శించాడు.

‘ఆదిపురుష్’లో ముఖ్య పాత్రలు చేసిన ఆర్టిస్టులందరూ తనకు తెలుసని.. వాళ్లలో చాలామంది ఇందులోని డైలాగుల విషయంలో అభ్యంతరాలు చెప్పారని విందు వెల్లడించాడు. షూటింగ్ స్పాట్లో డైలాగులు మార్చాలని దర్శక నిర్మాతలకు చెప్పినా.. వాళ్లు ఆ సూచనల్ని బేఖాతరు చేశారన్నాడు. తాము అసాధారణంగా ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్‌తో టీం ఉందని.. రౌత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం బాధాకరమని విందు అన్నాడు.

This post was last modified on March 12, 2024 6:30 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

43 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago