Movie News

కియారా పారితోషికం వింటే చుక్కలే

టాలీవుడ్ కు భరత్ అనే నేనుతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒక్కటే. డెబ్యూ సూపర్ హిట్టయ్యింది కానీ రెండోది డిజాస్టర్ కావడంతో హిందీ ఆఫర్లకే పరిమితమయ్యింది. చాలా గ్యాప్ తీసుకుని తిరిగి గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తో జోడి కట్టింది. వార్ 2లో ఆఫర్ కన్ఫర్మ్ అయ్యింది కానీ తాను నటించేది హృతిక్ రోషన్ పక్కనా లేక జూనియర్ ఎన్టీఆర్ సరసనా అనేది బయటికి రాలేదు. ఇదిలా తాజాగా డాన్ 2లో రణ్వీర్ సింగ్ తో చేయనున్న కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందేనని బాలీవుడ్ టాక్.

ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం. అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.

నెమ్మదిగా వెళ్తున్నా స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న కియారాకు క్రేజీ అవకాశాలు రావడం చూస్తే అనఫీషియల్ గా నెంబర్ వన్ స్థానంలో కూర్చున్నట్టే అని చెప్పొచ్చు. విచ్చలవిడి గ్లామర్ షోకు ఒప్పుకోకపోయినా కథ డిమాండ్ మేరకు వెసులుబాటు ఇచ్చే కియారాని సరికొత్తగా డాన్ 3లో చూడొచ్చని అంటున్నారు. గేమ్ ఛేంజర్ లో తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కియారాతో ఇంకొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. దర్శకుడు శంకర్ నటనకు ప్రాధాన్యం ఉండేలా పాత్ర ఇచ్చారట.

This post was last modified on March 4, 2024 5:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

11 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

12 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

12 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

13 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

14 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

15 hours ago