టాలీవుడ్ కు భరత్ అనే నేనుతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒక్కటే. డెబ్యూ సూపర్ హిట్టయ్యింది కానీ రెండోది డిజాస్టర్ కావడంతో హిందీ ఆఫర్లకే పరిమితమయ్యింది. చాలా గ్యాప్ తీసుకుని తిరిగి గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తో జోడి కట్టింది. వార్ 2లో ఆఫర్ కన్ఫర్మ్ అయ్యింది కానీ తాను నటించేది హృతిక్ రోషన్ పక్కనా లేక జూనియర్ ఎన్టీఆర్ సరసనా అనేది బయటికి రాలేదు. ఇదిలా తాజాగా డాన్ 2లో రణ్వీర్ సింగ్ తో చేయనున్న కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందేనని బాలీవుడ్ టాక్.
ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం. అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
నెమ్మదిగా వెళ్తున్నా స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న కియారాకు క్రేజీ అవకాశాలు రావడం చూస్తే అనఫీషియల్ గా నెంబర్ వన్ స్థానంలో కూర్చున్నట్టే అని చెప్పొచ్చు. విచ్చలవిడి గ్లామర్ షోకు ఒప్పుకోకపోయినా కథ డిమాండ్ మేరకు వెసులుబాటు ఇచ్చే కియారాని సరికొత్తగా డాన్ 3లో చూడొచ్చని అంటున్నారు. గేమ్ ఛేంజర్ లో తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కియారాతో ఇంకొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. దర్శకుడు శంకర్ నటనకు ప్రాధాన్యం ఉండేలా పాత్ర ఇచ్చారట.
This post was last modified on March 4, 2024 5:44 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…