హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ కు మహేష్ బాబుకి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్లు అక్కడ సిల్వర్ జూబిలీ ఆడి రికార్డులు నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35 ఎంఎంని తమ కోటగా భావిస్తారు ఫ్యాన్స్. అలాంటి చోట మహేష్ ఏకంగా ఒక మల్టీప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది. అదే నిజం కాబోతోంది. గచ్చిబౌలిలో ఏఎంబి సూపర్ ప్లెక్స్ తర్వాత దాన్ని మించిన మరో సముదాయం గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ముస్తాబు కాబోతోంది. మొత్తం 7 స్క్రీన్లతో దీనికి ఎఎంబి క్లాసిక్ అని నామకరణం చేస్తున్నారు. ఏషియన్ భాగస్వామ్యంలో ఉంటుంది.
దీనికి తాలూకు ఫోటో అభిమానుల మధ్య వైరలవుతోంది. గతంలో వెంకటేష్ పార్ట్ నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది కానీ దానికి భిన్నంగా ఇది మహేష్ చేతుల్లోకి రావడం విశేషం. సింగల్ స్క్రీన్లకు నెలవుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఇది మొదటి మల్టీప్లెక్స్. కొత్త రిలీజులు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడటం రివాజుగా పెట్టుకున్నవాళ్ళు లక్షల్లో ఉంటారు. ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయినా తర్వాతి రోజుల్లో అయినా సరే ఇక్కడ చూస్తే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు కొదవే లేదు. అలాంటిది ఖరీదైన సముదాయం వస్తే ఎలా అని ప్రేక్షకులు టెన్షన్ పడనక్కర్లేదు.
ఉన్నవాటిని తీసేసే ఆలోచనేదీ లేదట. కాకపోతే మల్టీప్లెక్సుల ప్రభావం ఖచ్చితంగా సింగల్ స్క్రీన్ల మీద ఉండకపోదు. స్థానికులు మాత్రం తమకు ఉపాధి వ్యాపార అవకాశాలు పెరుగుతాయని సంబరపడుతుండగా, ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నారాయణగూడ మరింత బిజీ జంక్షన్ గా మారడం ఖాయం. ప్రస్తుతం శాంతి, సప్తగిరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70, తారకరామ, శ్రీ మయూరి ఈ ప్రాంతంలో ఉన్నాయి. రికార్డుల పరంగా మైలురాళ్ళు నమోదు చేసే క్రాస్ రోడ్స్ లో ఇకపై మల్టీప్లెక్సులకు సంబంధించి కూడా కొత్త బెంచ్ మార్క్ నమోదు కానుంది.
This post was last modified on February 26, 2024 10:25 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…