Movie News

దసరా నిర్మాత.. కింగ్ జాకీ క్వీన్

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన నిర్మాతల్లో సుధాకర్ చెరుకూరి ఒకరు. నిర్మాతగా ఆయన సక్సెస్ రేట్ గొప్పగా లేదు కానీ.. వైవిధ్యమైన చిత్రాలతో ఆయన తన అభిరుచిని చాటుకున్నాడు. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.

వీటి తర్వాత ‘దసరా’ సినిమాకు ఆయనకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఐతే గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ నాని సినిమా సుధాకర్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను రిలీజ్ చేసిన ఆయనకు.. ఓవర్ ఫ్లోస్ రూపంలోనూ ఆదాయం వచ్చింది.

దసరా తర్ావత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనే ఇంకో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు సుధాకర్. ఈలోపు ఒక కొత్త సినిమాను ప్రకటించాడు సుధాకర్. దాదాపుగా అందరూ కొత్త వాళ్లతో చేస్తున్న సినిమా ఇది. కన్నడలో బిగ్ హిట్ అయిన ‘దియా’తో హీరోగా పరిచయం అయి.. ‘దసరా’ హీరో ఫ్రెండుగా కీలక పాత్రలో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో హీరో. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఇందులో మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

‘రంగబలి’లో తన అందంతో ఆకట్టుకున్న యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ‘కింగ్ జాకీ క్వీన్’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. కేకే అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రోజే ముఖ్య పాత్రల పరిచయంతో ఒక టీజర్ వదిలారు. అది చూస్తే మంచి క్వాలిటీ కనిపిస్తోంది. ఇదొక క్రైమ్ సినిమాలా ఉంది. టీజర్‌తో బాగానే ఇంప్రెస్ చేసిన ‘క్వీన్ జాకీ క్వీన్’ సినిమాగాా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

This post was last modified on February 20, 2024 5:35 pm

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

5 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

6 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

7 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

8 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

10 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

11 hours ago