Movie News

దసరా నిర్మాత.. కింగ్ జాకీ క్వీన్

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన నిర్మాతల్లో సుధాకర్ చెరుకూరి ఒకరు. నిర్మాతగా ఆయన సక్సెస్ రేట్ గొప్పగా లేదు కానీ.. వైవిధ్యమైన చిత్రాలతో ఆయన తన అభిరుచిని చాటుకున్నాడు. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.

వీటి తర్వాత ‘దసరా’ సినిమాకు ఆయనకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఐతే గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ నాని సినిమా సుధాకర్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను రిలీజ్ చేసిన ఆయనకు.. ఓవర్ ఫ్లోస్ రూపంలోనూ ఆదాయం వచ్చింది.

దసరా తర్ావత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనే ఇంకో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు సుధాకర్. ఈలోపు ఒక కొత్త సినిమాను ప్రకటించాడు సుధాకర్. దాదాపుగా అందరూ కొత్త వాళ్లతో చేస్తున్న సినిమా ఇది. కన్నడలో బిగ్ హిట్ అయిన ‘దియా’తో హీరోగా పరిచయం అయి.. ‘దసరా’ హీరో ఫ్రెండుగా కీలక పాత్రలో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో హీరో. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఇందులో మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

‘రంగబలి’లో తన అందంతో ఆకట్టుకున్న యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ‘కింగ్ జాకీ క్వీన్’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. కేకే అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రోజే ముఖ్య పాత్రల పరిచయంతో ఒక టీజర్ వదిలారు. అది చూస్తే మంచి క్వాలిటీ కనిపిస్తోంది. ఇదొక క్రైమ్ సినిమాలా ఉంది. టీజర్‌తో బాగానే ఇంప్రెస్ చేసిన ‘క్వీన్ జాకీ క్వీన్’ సినిమాగాా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

This post was last modified on February 20, 2024 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

7 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago