గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన నిర్మాతల్లో సుధాకర్ చెరుకూరి ఒకరు. నిర్మాతగా ఆయన సక్సెస్ రేట్ గొప్పగా లేదు కానీ.. వైవిధ్యమైన చిత్రాలతో ఆయన తన అభిరుచిని చాటుకున్నాడు. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.
వీటి తర్వాత ‘దసరా’ సినిమాకు ఆయనకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఐతే గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ నాని సినిమా సుధాకర్కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టేబుల్ ప్రాఫిట్తో సినిమాను రిలీజ్ చేసిన ఆయనకు.. ఓవర్ ఫ్లోస్ రూపంలోనూ ఆదాయం వచ్చింది.
దసరా తర్ావత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనే ఇంకో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు సుధాకర్. ఈలోపు ఒక కొత్త సినిమాను ప్రకటించాడు సుధాకర్. దాదాపుగా అందరూ కొత్త వాళ్లతో చేస్తున్న సినిమా ఇది. కన్నడలో బిగ్ హిట్ అయిన ‘దియా’తో హీరోగా పరిచయం అయి.. ‘దసరా’ హీరో ఫ్రెండుగా కీలక పాత్రలో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో హీరో. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఇందులో మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
‘రంగబలి’లో తన అందంతో ఆకట్టుకున్న యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ‘కింగ్ జాకీ క్వీన్’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. కేకే అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రోజే ముఖ్య పాత్రల పరిచయంతో ఒక టీజర్ వదిలారు. అది చూస్తే మంచి క్వాలిటీ కనిపిస్తోంది. ఇదొక క్రైమ్ సినిమాలా ఉంది. టీజర్తో బాగానే ఇంప్రెస్ చేసిన ‘క్వీన్ జాకీ క్వీన్’ సినిమాగాా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on February 20, 2024 5:35 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…