Movie News

డ్రగ్స్ టెస్టుకు రెడీ…ప్రూవ్ చేస్తే ముంబై వదిలేస్తా:కంగనా

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ కోణం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుశాంత్ ప్రియురాలు రియాను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, బాలీవుడ్ లో డ్రగ్స్ నీళ్లలా పారుతుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఆ డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పుతానని, కానీ, తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపై కంగనా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ముంబై పోలీసులకు కంగనా చాలెంజ్ విసిరింది. తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగానీ, డ్రగ్ సప్లయర్స్ తో లింకులున్నట్టుగానీ తేలితే శాశ్వతంగా ముంబై విడిచి వెళ్లిపోతానని కంగనా చాలెంజ్ చేసింది. తనకు డ్రగ్స్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు చెక్ చేసుకోవచ్చని చెప్పింది. విచారణ కోసం తాను ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేసింది.

కంగనా రనౌత్ పై ఆమె మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ 2016లో చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టాయి. 2016లో ఓ పార్టీ సందర్భంగా కొకైన్ తీసుకోవాలని కంగనా తనను బలవంతపెట్టిందని,కంగనాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అధ్యయన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతే కాదు, కొకైన్ తీసుకోనందుకు తనతో కంగనా చాలాసేపు గొడవపడిందని అధ్యయన్ అన్నాడు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ప్రభుత్వానికి సమర్పించిన ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు….ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అన్న అంశంపై విచారణకు ఆదేశించామని, ముంబై పోలీసులు విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఈ క్రమంలోనే తాను టెస్టులకు రెడీ అని, ఒకవేళ తాను ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నట్లుగానీ, డ్రగ్ డీలర్లతో కాంటాక్ట్స్ ఉన్నట్లుగానీ తేలితే ముంబై విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని కంగనా చాలెంజ్ చేసింది.

This post was last modified on September 8, 2020 7:40 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

47 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago