కొన్ని రోజులుగా అనుకుంటున్నదే.. కాకపోతే కొంచెం ఆలస్యంగా జరిగింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్టయింది. కానీ ఆమె అరెస్టయింది సుశాంత్ మృతికి సంబంధించిన వ్యవహారంలో కాదు. మాదక ద్రవ్యాల కేసులో. ఆమెను అరెస్టు చేసింది కూడా జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థనే. సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారుల విచారణలో భాగంగా రియా చక్రవర్తి డ్రగ్స్ వాడేదని, బాలీవుడ్లో తరచుగా డ్రగ్స్ వాడే బ్యాచ్లో రియా కూడా ఒకరని.. ఆమె సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందని వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో డ్రగ్స్ నిరోధక అధికారులు కొన్ని రోజులుగా రియాను విచారిస్తున్నారు.
తాజాగా విచారణకు హాజరైనపుడే రియా నుంచి కీలక సమాచారం రాబట్టారని, ఆమె ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయమని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం రియాను అధికారులు అరెస్టు చేశారు. బాలీవుడ్ ప్రముఖులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులు రియా పేరు చెప్పారని.. ఆమెతో పాటు పలువురి పేర్లు బయట పడ్డాయని.. త్వరలో మరికొందరు అరెస్టయ్యే అవకాశముందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఇంతకుముందు టాలీవుడ్లో సైతం ఇలా పలువురికి డ్రగ్స్తో సంబంధం ఉందని హైదరాబాద్ పోలీసు అధికారులు నోటీసులివ్వడం, విచారించడం చేశారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం అయింది. కానీ ఆ తర్వాత ఈ కేసులో ఏ పురోగతీ లేదు. ఆ కేసు పక్కకు వెళ్లిపోయింది. ఎలాంటి చర్యలూ లేవు. మరి బాలీవుడ్లో సైతం ఊరికే కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేస్తారా.. లేక నిజంగా చర్యలు చేపడతారా అన్నది చూడాలి.
This post was last modified on September 8, 2020 7:28 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…