ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కి న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో తన సినిమాల ఓటిటి హక్కులు తనకే కావాలని రేట్ ఎక్కువ చెబుతున్నా సరే డిమాండ్ చేసి మరీ తీసేసుకుంటోంది. ఇది ‘అంటే సుందరానికి’తో మొదలైంది. దాని బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోయినా డిజిటల్ లో మాత్రం దుమ్ము రేపింది. గత ఏడాది ‘దసరా’తో మిలియన్ల వ్యూస్ తాకిడి వచ్చి పడింది. మల్టీ లాంగ్వేజ్ వెర్షన్లు కావడంతో సబ్ టైటిల్స్ అవసరం లేకుండానే అన్ని రాష్ట్రాల ఆడియన్స్ ఈ మాస్ బ్లాక్ బస్టర్ ని ఎగబడి చూశారు. వారాల తరబడి టాప్ 5లో ఉంది.
ఇటీవలే ‘హాయ్ నాన్న’ను సొంతం చేసుకుని తిరిగి అదే ఫలితాన్ని రిపీట్ చేసుకుంటోంది. సలార్,యానిమల్ రాక ముందు వరకు నెట్ ఫ్లిక్స్ లో డామినేషన్ పూర్తిగా ఈ ఎమోషనల్ డ్రామాదే. హిందీ వెర్షన్ సైతం భారీ రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. తాజాగా నిర్మాణంలో ఉన్న ‘సరిపోదా శనివారం’ సైతం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు నలభై అయిదు కోట్లకు డీల్ జరిగినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ గత చిత్రం కంటే పదిహేను కోట్లు ఎక్కువ చెప్పినా వెనుకాడలేదట. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాని సరిపోదా శనివారంకి వివేక్ ఆత్రేయ దర్శకుడు.
ఇలా ఒకే హీరో సినిమాలు వరసగా కొనడంలో నెట్ ఫ్లిక్స్ చిరంజీవి తర్వాత నానికే చేస్తోంది. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లను పట్టేసుకుని తాజాగా విశ్వంభర కోసం గట్టిగా ట్రై చేస్తోందట. సౌత్ మీద వందల కోట్ల పెట్టుబడులతో ప్రైమ్, హాట్ స్టార్, సోనీలను పూర్తిగా వెనక్కు నెట్టేసే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ 2024లో పదికి పైగానే క్రేజీ మూవీస్ ని సొంతం చేసుకుంది. వాటిలో పుష్ప 2, దేవర 1, విడి 12 లాంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. నాని నెక్స్ట్ ఏ కాంబినేషన్ ఒప్పుకున్నా నెట్ ఫ్లిక్స్ వెంటనే రంగంలోకి దిగి సదరు నిర్మాతలతో ఒప్పందాలు చేసుకునేలా ఉంది.
This post was last modified on January 30, 2024 9:59 am
మాములుగా ఏ భాష సినిమాలైనా థియేటర్ కు ఓటిటికి మహా అయితే రెండు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం…
సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…