Movie News

పవన్ ఫస్ట్ కాల్ షీట్ దానికే..

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ కాదు.. జనసేనాని మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన కొన్ని నెలల ముందు సినిమాలు పక్కన పెట్టేశారు. ఆయన కోసం మూడు చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ఒకవేళ ఏపీలో తెలుగుదేశం-జనసేన కూటమి అధికారంలోకి వచ్చి పవన్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి వర్గంలోకి వచ్చినా.. ఈ సినిమాలు పూర్తి చేయక తప్పదు. కొన్ని నెలలు సినిమాల కోసం కేటాయించి చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేయాల్సిందే.

పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ మధ్య దశలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాక వీటిలో దేనికి ప్రయారిటీ ఇస్తారన్నది ఆసక్తికరం.

అనౌన్స్‌మెంట్, షూట్ ఎప్పుడు జరిగాయి అన్న దానికి ప్రకారం వరుస క్రమం చూస్తే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ.. ఇలా ఉంటుంది. కానీ పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాక ముందు టేకప్ చేసే చిత్రం.. ఓజీనేనట. ఈ మూడు చిత్రాల్లో మేజర్ షూటింగ్ జరిగింది ఓజీనే. దాని చిత్రీకరణ 70 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. నిజానికి బ్రేక్ తీసుకోవడానికి ముందే ఈ సినిమాను పూర్తి చేసేయాలని పవన్ చూశాడు. కానీ కుదరలేదు. మళ్లీ అందుబాటులోకి వచ్చాక కాల్ షీట్లు దీనికే కేటాయిస్తాడట.

జూన్-జులై కల్లా సినిమాను పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తయ్యాక ‘ఉస్తాద్..’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎటొచ్చీ ఈ ఏడాది చివరికల్లా అన్ని సినిమాలనూ పూర్తి చేసి సినిమాల నుంచి మళ్లీ బ్రేక్ తీసుకోవాలని పవన్ అనుకుంటున్నాడట.

This post was last modified on January 29, 2024 4:12 pm

Share
Show comments

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

5 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

5 hours ago