సోలో హీరోగా కలర్ ఫోటో లాంటి అవార్డు సినిమలో భాగమై గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరైన సుహాస్ కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2 విడుదలవుతోంది. ప్రమోషన్ల విషయంలో క్రియేటివ్ గా వెళ్తున్న టీమ్ గతంలో టీజర్ ద్వారా ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. తాజాగా ట్రైలర్ ని హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో ఘనంగా లాంచ్ చేశారు. సంక్రాంతి రిలీజుల తర్వాత రెండు వారాల దాకా టాలీవుడ్ నుంచి ఏ స్ట్రెయిట్ మూవీ రాకపోవడం ఈ మ్యారేజ్ బ్యాండ్ కి కలిసి వచ్చేలా ఉంది. ఇంతకీ కథాకమామీషు ఏం చెప్పారో చూద్దాం.
అంబాజీపేటలో సెలూన్ నడుపుకుంటూ పెళ్లిళ్లు, చావులకు బ్యాండ్ మేళం వాయించే కుర్రాడు మల్లి(సుహాస్). ఊళ్ళో పెద్ద కులానికి చెందిన లక్ష్మి(శివాని)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. స్కూల్లో టీజర్ గా పని చేసే మల్లి అక్కయ్య(శరణ్య ప్రదీప్) మీద కన్నేసిన ఓ మోతుబరి (నితిన్ ప్రసన్న) వల్ల వీళ్ళ కుటుంబం చిక్కుల్లో పడుతుంది. ఎలాగైనా వీళ్ళను అణచాలని కంకణం కట్టుకున్న దుర్మార్గులు మల్లికి గుండు కొట్టించి అవమానించడమే కాక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తేలా చేస్తారు. దీంతో మల్లి తిరగబడతాడు. తోడబుట్టిన దాన్ని కాపాడుకుంటూ ప్రేమని ఎలా గెలిచాడనేదే స్టోరీ.
పూర్తి పల్లెటూరి నేపథ్యంలో వినోదంతో పాటు ఇంటెన్స్ డ్రామాని జొప్పించాడు దర్శకుడు దుశ్యంత్ కటికనేని. సుహాస్ లోని పెర్ఫార్మర్ ని మరోసారి వెలికి తీశాడు. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం, వాజిద్ బేగ్ ఛాయాగ్రహణం సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. హీరోయిన్ శివాని సహజంగా ఉండగా పుష్ప జగదీశ్, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన క్యాస్టింగ్ లో ఉన్నారు. అక్క సెంటిమెంట్ తో పాటు మాస్ లవ్ స్టోరీని టచ్ చేసిన దుశ్యంత్ ట్రైలర్ కట్ తో అంచనాలైతే అందుకున్నాడు. అసలు కంటెంట్ కూడా ఇంతే స్థాయిలో ఉంటే సుహాస్ ఖాతాలో ఇంకో సూపర్ హిట్ పక్కానే.
This post was last modified on January 24, 2024 1:35 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…