టాలీవుడ్ కామధేనువుగా మారిన సంక్రాంతి అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలకు ఇంకో రెండు రోజులు హాలిడేస్ ఉన్నప్పటికీ సగటు మధ్యతరగతి ఉద్యోగ జీవితం మాత్రం ఈ రోజుతో తిరిగి ప్రారంభం. ఈ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా పోటీ పడ్డ నాలుగు సినిమాల్లో విజేత ఎవరో క్లారిటీ వచ్చేసింది. యునానిమస్ గా ప్రేక్షకులు, బయ్యర్లు ఇద్దరూ ‘హనుమాన్’కే ఓటేశారు. పెట్టుబడి – రాబడి లెక్కలు, కంటెంట్ ఇలా రెండు విషయాల్లో విన్నర్ గా నిలబడింది. వారం తిరిగే లోపు వంద కోట్ల గ్రాస్ దాటించేసి ఔరా అనిపించింది.
రెండో స్థానం ‘నా సామిరంగ’కు ఖరారైనట్టే. పండగ రేసులో చివరిగా ఆదివారం వచ్చిన నాగార్జున దొరికిన తక్కువ థియేటర్లలోనూ మాస్ అండతో గట్టెక్కేశారు. రీజనబుల్ రేట్లతో బిజినెస్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వేగంగా లాభాలు చూసేందుకు ఛాన్స్ దొరికింది. బిసి సెంటర్లు కిష్టయ్యకి అండగా నిలబడ్డాయి. కథా కథనాలు మరీ కొత్తగా లేకపోయినా విలేజ్ డ్రామాని విజయ్ బిన్నీ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇక ‘గుంటూరు కారం’ అందరి కంటే భారీ కలెక్షన్లు కొల్లగొట్టినా మొదటి రోజు జోరుని ఆపై అంతే స్పీడులో కొనసాగించలేకపోయింది. థియేట్రికల్ బిజినెస్ కొండంత లక్ష్యాన్ని పెట్టింది. మహేష్ బాబు బ్రాండ్ గ్రాస్ ని రెండు వందల కోట్లకు దగ్గరగా తీసుకెళ్తున్నా కానీ రెండో వారం ఎంత బలంగా నిలబడుతుందనేది కీలకం.
వెంకటేష్ 75వ సినిమాగా ప్రమోట్ చేసుకున్న ‘సైంధవ్’ చివరి ప్లేస్ ని తీసుకుని అభిమానులను నిరాశ పరిచింది. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. ఎమోషన్, యాక్షన్ ఉన్నా ఫ్యామిలీస్, మాస్ కి కావాల్సిన కమర్షియల్ అంశాలు కొరవడటంతో ఫ్లాప్ ముద్ర తప్పించుకోవడం కష్టంగానే ఉంది. ఇంకో వారంపైగానే చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఈ నాలుగు సినిమాలకు ఇంకో ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగా ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితిలోనూ హనుమాన్ ఆక్యుపెన్సీలు చాలా బలంగా ఉండటం గమనించాల్సిన విషయం.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…