తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే శ్రీలీలే. అచ్చ తెలుగు అమ్మాయి అయిన శ్రీ లీల రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు రావడం విశేషం. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆమె.. అక్కడి ఫిలిం ఇండస్ట్రీలో కథానాయక పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది. తెలుగులో నటించిన తొలి చిత్రం పెళ్లి సందడి హిట్ కావడం, శ్రీలీలకు మంచి పేరు రావడంతో ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన మహేష్ బాబు సరసన ఆమె నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా బాగా ఆడితే శ్రీ లీల కెరీర్ ఇంకో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఇంకో రెండేళ్ల పాటు శ్రీలీల డైరీలో ఖాళీయే లేదు.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే ఇంకోవైపు బ్రాండ్ల ప్రచారంలోనూ శ్రీలీల దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అర డజనుకు పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఇంకా బోలెడన్ని ఆఫర్లు వస్తుండగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా ఒక మద్యం బ్రాండ్, ఓ అలాగే బెట్టింగ్ యాప్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. కానీ అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని శ్రీలీల ఖరాఖండిగా చెప్పేసిందట. జనాలను తప్పుదోవ పట్టించే, వారిపై ప్రతికూల ప్రభావం చూపించే బ్రాండ్లకు ప్రచారం చేయకూడదని శ్రీలీల ముందే రూల్ పెట్టుకుందట. ఆ ప్రకారమే ఎంత పారిశోషకం ఆఫర్ చేసినా సరే ఆ బ్రాండ్లకు నో చెప్పేస్తోందట.
బాలీవుడ్లో అమితాబచ్చన్, టాలీవుడ్లో అల్లు అర్జున్ లాంటి వారు ఇలాంటి రూల్స్ పెట్టుకుని పని చేస్తున్నారు. శ్రీలీల సైతం మంచి ప్రిన్సిపుల్స్ పెట్టుకుని ఇలాంటి బ్రాండ్లకు నో చెప్పడం ద్వారా ప్రశంసలు అందుకుంటోంది.
This post was last modified on January 11, 2024 2:07 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…