తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే శ్రీలీలే. అచ్చ తెలుగు అమ్మాయి అయిన శ్రీ లీల రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు రావడం విశేషం. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆమె.. అక్కడి ఫిలిం ఇండస్ట్రీలో కథానాయక పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది. తెలుగులో నటించిన తొలి చిత్రం పెళ్లి సందడి హిట్ కావడం, శ్రీలీలకు మంచి పేరు రావడంతో ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన మహేష్ బాబు సరసన ఆమె నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా బాగా ఆడితే శ్రీ లీల కెరీర్ ఇంకో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఇంకో రెండేళ్ల పాటు శ్రీలీల డైరీలో ఖాళీయే లేదు.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే ఇంకోవైపు బ్రాండ్ల ప్రచారంలోనూ శ్రీలీల దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అర డజనుకు పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఇంకా బోలెడన్ని ఆఫర్లు వస్తుండగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా ఒక మద్యం బ్రాండ్, ఓ అలాగే బెట్టింగ్ యాప్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. కానీ అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని శ్రీలీల ఖరాఖండిగా చెప్పేసిందట. జనాలను తప్పుదోవ పట్టించే, వారిపై ప్రతికూల ప్రభావం చూపించే బ్రాండ్లకు ప్రచారం చేయకూడదని శ్రీలీల ముందే రూల్ పెట్టుకుందట. ఆ ప్రకారమే ఎంత పారిశోషకం ఆఫర్ చేసినా సరే ఆ బ్రాండ్లకు నో చెప్పేస్తోందట.
బాలీవుడ్లో అమితాబచ్చన్, టాలీవుడ్లో అల్లు అర్జున్ లాంటి వారు ఇలాంటి రూల్స్ పెట్టుకుని పని చేస్తున్నారు. శ్రీలీల సైతం మంచి ప్రిన్సిపుల్స్ పెట్టుకుని ఇలాంటి బ్రాండ్లకు నో చెప్పడం ద్వారా ప్రశంసలు అందుకుంటోంది.
This post was last modified on January 11, 2024 2:07 pm
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…