బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా 10 రెట్లు, అంత కంటే ఎక్కువే పెరిగింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అవతరించాడు ఈ టాలీవుడ్ హీరో. కానీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిన ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సినిమాలు తర్వాత రాలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్.. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి. ఈ స్థితిలో ప్రభాస్.. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జట్టు కట్టగానే ఇది కదా కాంబినేషన్ అంటే అనిపించింది అభిమానులకు.
కేజిఎఫ్ లో మాస్ ఇమేజ్ లేని యశ్ లాంటి చిన్న హీరోతో అదిరిపోయే రేంజ్ లో ఎలివేషన్స్ సీన్లు పండించిన ప్రశాంత్.. ప్రభాస్ ను ఇంకెలా చూపిస్తాడో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయింది. ఈ రోజు సలార్ సినిమా చూసిన వాళ్ళందరూ ప్రభాస్ ను ప్రశాంత్ ప్రజెంట్ చేసిన విషయంలో పూర్తి సంతృప్తి చెందారు.
సలార్ సినిమాలో ప్రభాస్ పాత్ర గొప్పగా ఏమీ లేదు. కేజిఎఫ్ లో రాఖీ పాత్ర లాగా ఇందులో క్యారెక్టర్ గ్రాఫ్ పెద్దగా కనిపించదు. క్యారెక్టర్ పరంగా షేడ్స్ కూడా తక్కువే. పెర్ఫామెన్స్ విషయంలోనూ ప్రభాస్ పెద్దగా స్కోర్ చేసింది లేదు. కానీ సినిమాలో ప్రభాస్ కనిపించే ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు. అందుకు కారణం ప్రభాస్ కటౌట్, తన స్క్రీన్ ప్రెజెన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ ను మాస్ కోణంలో ది బెస్ట్ గా చూపించింది ప్రశాంత్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి మాస్ కటౌట్ ఇప్పటిదాకా ఎవరికీ లేదు, ఇకముందు ఎవరికి రాదు అనిపించే స్థాయిలో ప్రభాస్ కనిపించాడు తెరమీద. ఇదేం కటౌట్ ఇదేం స్క్రీన్ ప్రెజెన్స్ స్వామీ అని ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి చూసేలా తనను చూపించాడు ప్రశాంత్ నీల్.
యాక్షన్ ఘట్టాల గురించి, ఎలివేషన్స్ సీన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటర్వల్ ఎపిసోడ్, ద్వితీయార్థంలో దేవత ముందు జరిగే ఫైట్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో ప్రభాస్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేశాయి. ఓవరాల్ గా సలార్ సినిమా వీకే అయినప్పటికీ.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకొని ఎలివేషన్, యాక్షన్ సీన్లను పేలిపోయేలా మలచడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈజీగా పాస్ అయిపోయేలా కనిపిస్తోంది.
This post was last modified on December 22, 2023 7:21 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…