సలార్ బాక్స్ ఆఫీస్ విందుకు ఇంకొక రోజే సమయం ఉంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాల్లో దీనికే అత్యంత హైప్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మళ్ళీ బాహుబలి రోజులే గుర్తొస్తున్నాయి. బాహుబలి, సలార్ రెండు భిన్నమైన చిత్రాలే అయినప్పటికీ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే కాక మరో విషయంలోనూ పోలిక ఉండడం విశేషం.
బాహుబలి లాగే ఇది కూడా రెండు భాగాలుగా తెరకక్కనుండగా.. బాహుబలి-1 లాగే సలార్-1కు కూడా ముగింపులో ఒక కొసమెరుపు ఉండబోతున్న విషయం వెల్లడైంది. స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీలే ఈ విషయాన్ని వెల్లడించాడు.
బాహుబలి ఫస్ట్ పార్ట్ ను బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ముగించడం బాహుబలి-2 కు హైప్ పెంచడానికి ఎంతగా ఉపయోగపడిందో తెలిసిందే. దాదాపు ఇలాగే సలార్ ను కూడా ముగించబోతున్నట్టు ప్రశాంత్ తెలిపాడు. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ రాబోతున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ను ఒక కొసమెరుపుతో ముగించి తర్వాత ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచడం సహజమే అని.. అలాగే సలార్ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా ఒక హైలెట్ ఉందని ప్రశాంత్ చెప్పాడు.
సినిమాలో మేజర్ హైలైట్ ఏంటి అని సలార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కు దారి తీసేలా వచ్చే ట్విస్ట్ హైలెట్ గా ఉంటుందని.. సలార్-2 చూడాలా వద్దా, అసలు ఎందుకు చూడాలి అనేది అదే డిసైడ్ చేస్తుందని ప్రశాంత్ చెప్పడం ద్వారా క్లైమాక్స్ విషయంలో అభిమానుల్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేశాడు.
This post was last modified on December 21, 2023 10:44 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…