బాలీవుడ్లో ఎఫైర్లు, బ్రేకప్ లు సర్వసాధారణం. అక్కడ సెలబ్రిటీలు కూడా వీటి గురించి చాలా క్యాజువల్గా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో చర్చలన్నీ వీటి గురించే ఉంటాయి. ఈ షో పాపులారిటీ కూడా ఇలాంటి టాపిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఇదే షోలో తన భర్త రణ్వీర్ సింగ్ పక్కనుండగా దీపికా పదుకొనే తన పాత రిలేషన్షిప్స్ గురించి చెప్పిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. దీనివల్ల దీపికతో పాటు కరణ్ జోహార్ సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కొంపలు కూల్చే షో అంటూ కాఫీ విత్ కరణ్ మీద విమర్శల వర్షం కురిసింది. అయితే ఆ వివాదం మీద దీపిక, రణ్వీర్, కరణ్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కాగా ఇప్పుడు కరణ్ జోహార్.. తన షోలో దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ మీద విమర్శలు గుప్పించిన వారిపై తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఆ ఎపిసోడ్ ను ట్రోల్ చేసిన వారికి ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. తాజాగా సిద్ధార్థ రాయ్ కపూర్, అర్జున్ కపూర్ పాల్గొన్న ఎపిసోడ్లో కరణ్ మాట్లాడుతూ.. దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ ను ది బెస్ట్ గా అభివర్ణించాడు. దీపిక-రణ్వీర్ ఆ ఎపిసోడ్లో చాలా నిజాయితీగా.. ఓపెన్ గా మాట్లాడారని.. వారితో సంభాషణ చక్కగా సాగిందని.. అలాంటి ఎపిసోడ్ మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగడం అనూహ్యమని కరణ్ అన్నాడు.
దీపికను విమర్శించిన వాళ్ళందరూ చూసుకోవాలని.. పని పాట లేని వాళ్లే ఇలా చేస్తారని పేర్కొంటూ ట్రోలర్లకు ఆవేశంగా మిడిల్ ఫింగర్ చూపించాడు కరణ్. మామూలుగా విమర్శలను చాలా తేలిగ్గా తీసుకునే కరణ్ ఈ స్థాయిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on December 15, 2023 4:23 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…