నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసారకు కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు కానీ ఫైనల్ గా దానికి హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇవాళ జరిగిన డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ మొదలుపెడతామని చెప్పాడు. అయితే దర్శకుడు మారే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఎందుకంటే విశిష్ట పూర్తిగా చిరంజీవి విశ్వంభరతో లాక్ అయిపోయాడు. ఇంకో ఏడాది దాకా దొరికే ఛాన్స్ ఉండదు. భారీ ఫాంటసీ మూవీ కాబట్టి వేరే ప్రాజెక్టు ఒప్పుకోవడానికి స్కోప్ లేదు.
కథ మరి ఎవరిచ్చారనే స్పష్టత రావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే బింబిసార టైంలోనే దర్శకుడితో రెండు కమిట్ మెంట్లు తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. సక్సెస్ మీట్ లలో పరస్పరం ప్రకటనలు కూడా చేసుకున్నారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ వశిష్ట పక్కకు వచ్చేసి మెగా క్యాంపులో చేరిపోయాడు. ఒకవేళ లోగుట్టు ఏం జరగకపోయి ఉంటే సీక్వెల్ కూడా వశిష్ట చేతికే వచ్చేది. ప్రస్తుతం బింబిసార 2 తాలూకు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. డెవిల్ మీద చాలా నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్ ప్యాన్ ఇండియా మార్కెట్ ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
మంచి పొటెన్షియల్ ఉన్న బింబిసార లాంటివి రెండు భాగాలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదు. కళ్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ ఏడాది అమిగోస్ చేస్తే అది దారుణంగా పోయింది. యాక్షన్, కమర్షియల్, మసాలా కన్నా డిఫరెంట్ జానర్స్ ని ఎంచుకుంటేనే మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తించి దానికి తగ్గ కథలనే ఓకే చేస్తున్నాడు. డెవిల్ దర్శకుడి విషయంలో కూడా కాస్త రగడ జరిగింది కానీ ఫైనల్ గా నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడిగా మారిపోయాడు. డిసెంబర్ 29న విడుదల కాబోతున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ తో పాటు దేవర టీజర్ వదిలే సూచనలు ప్రస్తుతానికి లేనట్టే.
This post was last modified on December 12, 2023 9:00 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…