బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లు దాటేసి వెయ్యి మైలురాయి వైపు పరుగులు పెడుతున్న యానిమల్ ప్రధాన హైలైట్స్ లో ఒకటి ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే వయొలెంట్ ఎపిసోడ్. రన్బీర్ కపూర్ హోటల్ కి దుండగులు మొహాలు కనిపించకుండా స్టీల్ మాస్కులు లాంటివి వేసుకొచ్చి గొడ్డళ్ళతో చంపబోతే, రివర్స్ లో రణ్ విజయ్ సింగ్ అలియాస్ యానిమల్ గోడ మీదున్న అద్దం షో కేసు పగలగొట్టి అందులో నుంచి ఆయుధం తీయడం బాగా పేలింది. అక్కడి నుంచి రక్తపాతం ఏరులై పారుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి అర్జన్ వైలీ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రిలీజైన పది రోజుల తర్వాత ఈ ఫైట్ ఒరిజినల్ కాదని, మల్లువుడ్ నుంచి స్ఫూర్తి పొందిందని కొందరు వీడియోలతో సహా ప్రూఫ్ బయట పెట్టారు. 2010లో నాయకన్ పేరుతో మలయాళ చిత్రం వచ్చింది. ఇంద్రజిత్ సుకుమారన్ హీరో. కథాకళి కళాకారుడైన తండ్రి ఒక రాజకీయ నాయకుడి హత్యని చూసిన కారణంగా డాన్ చేతిలో కూతురితో సహా ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబానికి, కళకు దూరంగా ఉన్న కొడుకుకి విషయం తెలిసి ప్రతీకారం కోసం వెనక్కు వచ్చి చంపడం మొదలుపెడతాడు. క్లైమాక్స్ లో విలన్ డెన్ కి వెళ్ళినప్పుడు జరిగే పోరాటం అచ్చం యానిమల్ తరహాలోనే ఉంటుంది.
అప్పట్లో నాయకన్ మంచి విజయమే సాధించింది. తెలుగులో డబ్ లేదా రీమేక్ కావడం జరగలేదు. హిందీలోనూ వెళ్ళలేదు. అందుకే ఎవరికీ తెలిసే అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే రెండూ సినిమాల్లో తండ్రి మీద జరిగిన దాడులకు కొడుకులు ప్రతీకారం తీర్చుకోవడం కామన్ గా ఉండటం. రెండు పక్కన పెట్టి మరీ పోలికలు చూపుతున్నారు. అయినా నాయకన్ కూడా మరీ ఒరిజినలేం కాదు. హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిందే. టెక్నాలజీ ప్రపంచంలో ఇవన్నీ మాములే కానీ యాదృచ్చికమో లేక స్ఫూర్తి పొందటమో కారణం ఏదైతేనేం యానిమల్ సునామి ముందు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు.
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…