నిన్న విడుదలైన యానిమల్ ఓపెనింగ్స్ కళ్లుచెదిరేలా వచ్చాయి. అసలు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఊచకోత చేసిన రన్బీర్ కపూర్, సందీప్ వంగాలు తమ షాకింగ్ అవుట్ ఫుట్ తో యూత్ ని మెప్పించిన విషయం ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే బ్లాక్ బస్టర్ రేంజ్ కి చేరుకుంటుందా లేదానేది ఇప్పుడే చెప్పలేం. ఇవే వసూళ్లు ఒక వారం రోజులు ఏకధాటిగా వచ్చాయంటే మాత్రం సులభంగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి ప్రవేశిస్తుంది.అది సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందనే దాని మీద ఆధారపడింది. వీకెండ్ మాత్రం యానిమల్ ఆధిపత్యమే.
ఇదంతా ఓకే కానీ పాపా మేరీ జాన్(నాన్నా నువ్వే ప్రాణం) పాట లిరికల్ వీడియో చివరిలో రన్బీర్ కపూర్ బాగా మందు తాగేసి తన సిక్కు గ్యాంగ్ చూస్తుండగా సూటు బూటులో విమానంలోని కాక్ పిట్ కి వెళ్లి డ్రైవింగ్ కంట్రోల్ తన చేతిలోకి తీసుకుంటాడు. దానికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో ఎక్స్ ప్రెషన్లు ఓ రేంజ్ లో పేలాయి. అయితే ఈ షాట్, దానికి సంబంధించిన లింకింగ్ సీన్ సినిమాలో కనిపించలేదు. రన్బీర్ కపూర్ గాయపడి సందర్భాలు సినిమాలు రెండు మూడున్నాయి. ఆ టైంలోనే ఈ విమానం సీన్ ఉండాలి. కానీ మిస్ అయ్యింది. బహుశా ఎడిటింగ్ లో తీసేశారేమో.
ఇంత కిక్ ఇచ్చే సన్నివేశం కత్తెర కోతకు గురైతే అభిమానులు మనోభావాలు గాయపడతాయిగా. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు సందీప్ వంగా ఇంకా బయటికి రాలేదు కాబట్టి అప్పుడీ విషయాన్ని ప్రస్తావిస్తే సమాధానం రావొచ్చు. అయినా తాను 3 గంటల 49 నిమిషాల ఫైనల్ కట్ ఇచ్చానని, కానీ ప్రాక్టికల్ సమస్యల వల్ల దాన్ని అరగంట కుదించాల్సి వచ్చిందని దర్శకుడు చెప్పేశాడు కాబట్టి బహుశా పైన చెప్పింది ఈ కారణంగా ఎగిరిపోయి ఉండొచ్చు. ఓటిటి వెర్షన్ మాత్రం మొత్తం వస్తుందట. వైల్డ్ అండ్ బోల్డ్ క్యారెక్టరైజేషన్ తో యానిమల్ చేస్తున్న రచ్చ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉంది.
This post was last modified on December 2, 2023 10:29 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…