టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ మొదటి స్థానంలో ఉన్న శ్రీలీలకు క్రమంగా దెబ్బలు తగులుతున్నాయి. భగవంత్ కేసరి ఎంత పెద్ద హిట్ అయినా పెర్ఫార్మన్స్ పరంగా పేరొచ్చింది కానీ డామినేషన్ చేసింది మాత్రం బాలయ్యే. దానికన్నా ముందు స్కంద సూపర్ ఫ్లాప్ అయితే ఇటీవలే ఆదికేశవ మెగా డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ వచ్చే నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లోనూ రెగ్యులర్ హీరొయిన్ గా కనిపిస్తోంది తప్ప ప్రత్యేకంగా తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉంటారనుకోవడానికి లేదు. ట్రైలర్ చూస్తే కంటెంట్ అలా ఉంది కాబట్టి అధిక శాతం నితిన్ వన్ మ్యాన్ షోనే ఉండొచ్చు.
వీటి సంగతి పక్కనపెడితే గుంటూరు కారం మీద శ్రీలీల ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే విడుదలకు ఇంకో నలభై రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా తన లుక్ ఎలా ఉంటుందో బయట పెట్టలేదు. ప్రమోషన్లన్నీ మహేష్ బాబు బీడీ, పంచె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నొచ్చిన పాటలోనూ హీరోని మాత్రమే హైలైట్ చేశారు. డ్యూయెట్ల చిత్రీకరణ ఇంకా జరగలేదు కానీ తీసిన వరకు సీన్లలో నుంచి ఏదో ఒక లుక్ రిలీజ్ చేయాల్సింది. ఆది ఎలాగూ జరిగే వ్యవహారమే కానీ మహేష్ బాబు గ్లామర్ మీద శ్రీలీల ఆధిపత్యం చెలాయించడం సులభంగా మాత్రం ఉండదు.
తెరమీద మహేష్ ఉంటే ఆడమగ తేడా లేకుండా అందరి చూపు తనవైపే ఉంటుంది. అలాంటిది శ్రీలీల వైపు చూపు తిప్పేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారనేది కీలకం. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్నకు ఇదే సమస్య వచ్చి అంతగా హైలైట్ కాలేకపోయింది. మరి గుంటూరు కారంలో శ్రీలీలకు ఎంత స్కోప్ ఉందనేది రిలీజయ్యాకే తెలుస్తుంది. అయినా రెగ్యులర్ పాత్రలు వేసుకుంటే పోతే మార్కెట్ కి చిల్లు పడుతుందని తనకు మెల్లగా అర్థమవుతోంది. గత నెల రోజుల్లో మునుపటిలా తనకు ఉక్కిరిబిక్కిరి అయ్యే రేంజ్ లో కాల్స్ రావడం లేదట. నితిన్ మహేష్ ఇద్దరిలో ఎవరు బ్రేక్ ఇస్తారో చూడాలి
This post was last modified on November 30, 2023 7:31 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…