గతానికి భిన్నంగా ప్రముఖులు.. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జీవితాలు సంచలనాల చుట్టూ.. విషాదాలతో పెనవేసుకుంటున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకు చెందినదే. ఇండియన్ ఐడల్ ఫేమ్.. గాయనిగా సుపరిచితురాలైన 26 ఏళ్ల రేణు ఇప్పుడు ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు. ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఆమె తీవ్రంగా కుంగిపోయారని.. ఆమె ఆరోగ్యం విషమంగా మారినట్లు చెబుతున్నారు.
మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంటున్న రేణు.. ఇండియన్ ఐడల్ సీజన్ 10లో ఒక్కసారిగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. కొన్ని యాడ్స్ లో కూడా నటించిన ఆమెకు.. రవి శంకర్ అనే వివాహితుడితో ప్రేమాయణం సాగిస్తున్నారు. జూన్ లో వీరిద్దరు తమ ఇళ్లల్లో నుంచి పారిపోయారు. దీంతో.. రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె కనిపించటం అదేని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో విషం తాగిన రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడని తెలిసిన తర్వాత నుంచి రేణు ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పందుతున్నారు. సంగీతం నేర్చుకునే క్రమంలోనే రేణుకు రవిశంకర్ తో పరిచయమైనట్లు చెబుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…