డాడీ, ఆవార్గి, ఆషిఖి, సడక్ లాంటి ఎన్నో మెమొరబుల్ హిట్లు ఇచ్చిన దర్శకుడు మహేష్ భట్. 80లు, 90ల్లో ఆయన ఎన్నో క్లాసిక్స్ తీశారు. అప్పటికి ఇండియాలో ఉణ్న టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా మహేష్కు పేరుండేది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. ఐతే 90ల చివరికి వచ్చేసరికి మహేష్ జోరు తగ్గింది. సినిమాలు తీస్తూ పోయాడు కానీ.. ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో మెగా ఫోన్ పక్కన పెట్టేశాడు. 1999లో వచ్చిన ‘కర్టూస్’ ఆయన చివరి చిత్రం.
తర్వాత రెండు దశాబ్దాల్లో స్వీయ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా మాత్రం బోలెడన్ని చిత్రాలు నిర్మించాడు. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలే ఎక్కువ. మహేష్ భట్ నిర్మాణంలో సినిమా అంటే ఒకే కథ ఉంటుందనే విమర్శలు వచ్చాయి. మధ్య మధ్యలో వేరే జానర్లలోనూ సినిమాలు తీశాడు కానీ.. ఎక్కువ పాపులర్ అయింది ఈ తరహా సినిమాలే.
ఐతే ఎలాంటి సినిమాలు తీస్తేనేం బాక్సాఫీస్ సక్సెసే ముఖ్యం. భట్ సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి. కానీ నిర్మాతగా కూడా గత కొన్నేళ్లలో ఆయన జోరు తగ్గిపోయింది. వరుస ఫెయిల్యూర్లు ఎదురయ్యాయి. దీంతో మునుపటి స్పీడులో సినిమాలు తీయట్లేదు. ఇక మహేష్ భట్ ప్రస్థానం ముగిసినట్లే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ఇలాంటి సమయంలో భట్ చెయ్యకూడని పని ఒకటి చేశాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేయాలని ఆశపడ్డాడు. తన క్లాసిక్ ‘సడక్’కు సీక్వెల్ తీసి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆయన ఆశించినట్లున్నాడు. తన కూతురే అయినా స్టార్ హీరోయిన్ ఆలియాతో పాటు సంజయ్ దత్ లాంటి సీనియర్ను, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి మరో యంగ్ స్టార్ను పెట్టి ఈ సినిమా తీశాడు. కానీ రాంగ్ టైంలో ఈ సినిమా రిలీజైంది.
సుశాంత్ అనుమానాస్పద మృతి తర్వాత నెపోటిజం బ్యాచ్ అంటేనే జనాలు మండిపోతున్న టైంలో ఈ సినిమా వచ్చింది. దీనికి తోడు మహేష్ కెరీర్లోనే అత్యంత పేలవంగా ఈ సినిమా ఉండటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. దీన్ని మామూలుగా తిట్టిపోయట్లేదు. వాళ్ల కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఐఎండీబీలో ఇప్పటిదాకా ఏ పేరున్న సినిమాలకూ లేని విధంగా 1.1 రేటింగ్ వచ్చింది దీనికి.
ఇలాంటి దారుణమైన సినిమాతో, ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని ఇలా బాధాకరమైన వీడ్కోలు తీసుకోవాల్సి వస్తుందని మహేష్ భట్ లాంటి లెజెండరీ డైరెక్టర్ ఊహించి ఉండడు.
This post was last modified on August 29, 2020 4:36 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…