డాడీ, ఆవార్గి, ఆషిఖి, సడక్ లాంటి ఎన్నో మెమొరబుల్ హిట్లు ఇచ్చిన దర్శకుడు మహేష్ భట్. 80లు, 90ల్లో ఆయన ఎన్నో క్లాసిక్స్ తీశారు. అప్పటికి ఇండియాలో ఉణ్న టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా మహేష్కు పేరుండేది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. ఐతే 90ల చివరికి వచ్చేసరికి మహేష్ జోరు తగ్గింది. సినిమాలు తీస్తూ పోయాడు కానీ.. ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో మెగా ఫోన్ పక్కన పెట్టేశాడు. 1999లో వచ్చిన ‘కర్టూస్’ ఆయన చివరి చిత్రం.
తర్వాత రెండు దశాబ్దాల్లో స్వీయ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా మాత్రం బోలెడన్ని చిత్రాలు నిర్మించాడు. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాల నేపథ్యంలో వచ్చిన చిత్రాలే ఎక్కువ. మహేష్ భట్ నిర్మాణంలో సినిమా అంటే ఒకే కథ ఉంటుందనే విమర్శలు వచ్చాయి. మధ్య మధ్యలో వేరే జానర్లలోనూ సినిమాలు తీశాడు కానీ.. ఎక్కువ పాపులర్ అయింది ఈ తరహా సినిమాలే.
ఐతే ఎలాంటి సినిమాలు తీస్తేనేం బాక్సాఫీస్ సక్సెసే ముఖ్యం. భట్ సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి. కానీ నిర్మాతగా కూడా గత కొన్నేళ్లలో ఆయన జోరు తగ్గిపోయింది. వరుస ఫెయిల్యూర్లు ఎదురయ్యాయి. దీంతో మునుపటి స్పీడులో సినిమాలు తీయట్లేదు. ఇక మహేష్ భట్ ప్రస్థానం ముగిసినట్లే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ఇలాంటి సమయంలో భట్ చెయ్యకూడని పని ఒకటి చేశాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేయాలని ఆశపడ్డాడు. తన క్లాసిక్ ‘సడక్’కు సీక్వెల్ తీసి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆయన ఆశించినట్లున్నాడు. తన కూతురే అయినా స్టార్ హీరోయిన్ ఆలియాతో పాటు సంజయ్ దత్ లాంటి సీనియర్ను, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి మరో యంగ్ స్టార్ను పెట్టి ఈ సినిమా తీశాడు. కానీ రాంగ్ టైంలో ఈ సినిమా రిలీజైంది.
సుశాంత్ అనుమానాస్పద మృతి తర్వాత నెపోటిజం బ్యాచ్ అంటేనే జనాలు మండిపోతున్న టైంలో ఈ సినిమా వచ్చింది. దీనికి తోడు మహేష్ కెరీర్లోనే అత్యంత పేలవంగా ఈ సినిమా ఉండటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. దీన్ని మామూలుగా తిట్టిపోయట్లేదు. వాళ్ల కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఐఎండీబీలో ఇప్పటిదాకా ఏ పేరున్న సినిమాలకూ లేని విధంగా 1.1 రేటింగ్ వచ్చింది దీనికి.
ఇలాంటి దారుణమైన సినిమాతో, ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని ఇలా బాధాకరమైన వీడ్కోలు తీసుకోవాల్సి వస్తుందని మహేష్ భట్ లాంటి లెజెండరీ డైరెక్టర్ ఊహించి ఉండడు.
This post was last modified on August 29, 2020 4:36 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…