ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని విషాదంలో ముంచెత్తే వార్త బయటికి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మన్ క్యాన్సర్తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడన్నదే ఈ వార్త. చాలామందికి అతను క్యాన్సర్ బారిన పడ్డట్లే తెలియదు.
నాలుగేళ్లుగా అతను క్యాన్సర్తో పోరాడుతున్నాడని.. అది బయట పడే సమయానికే మూడో దశ అని.. ఇటీవల నాలుగో దశకు చేరిందని.. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతణ్ని కాపాడలేకపోయారని వెల్లడైంది.
కేవలం 43 ఏళ్ల వయసులో బోస్మన్ ఇలా ప్రాణాలు విడవడం అతడి అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ‘బ్లాక్పాంథర్’ సహా అనేక సినిమాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఇలా అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడని ఎవరూ ఊహించలేదు.
సాధారణంగా క్యాన్సర్ బారిన పడ్డ వాళ్లు అన్ని పనులూ మానేసి చికిత్స, ఆరోగ్యం మీదే దృష్టిపెడతారు. కానీ బోస్మన్ మృత్యువుతో పోరాడుతూనే బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2016లో బోస్మన్ పెద్ద పేగులో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
అప్పటికే అది మూడో దశలో ఉంది. ఇక అప్పట్నుంచి అతడికి చికిత్స అందుతోంది. ఐతే బోస్మన్ సినిమాలు మాత్రం ఆపేయలేదు. అతడికి ఎంతో పేరు తీసుకొచ్చిన ‘బ్లాక్ పాంథర్’లో నటించాడు. హాలీవుడ్ సూపర్ హీరోల్లో ఒకడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. ఆ చిత్రం రెండేళ్ల కిందట విడుదలైంది.
ఇదే కాక గత నాలుగేళ్లలో అతను మార్షల్, ఎవెంజర్స్:ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్, 21 బ్రిడ్జెస్, డా 5 బ్లడ్స్ లాంటి భారీ చిత్రాల్లో నటించాడు. అతను నటించిన చివరి చిత్రం ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా మృత్యువుతో పోరాడుతూ కూడా సినిమాల్లో అంత ఉత్సాహంగా నటించాడంటే బోస్మన్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on August 29, 2020 4:04 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…