రెండేళ్ల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో తెలిసిందే. సాధారణ ఎన్నికల స్థాయిలో ఇవి చర్చనీయాంశం అయ్యాయి. హోరాహోరీగా సాగిన పోరులో ప్రకాష్ రాజ్ మీద మంచు విష్ణు గెలిచి ‘మా’ అధ్యక్షుడు అయ్యాడు. ఎన్నికల అనంతరం కూడా డ్రామా కొనసాగి.. ప్రకాష్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేయడం.. ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు కార్యవర్గం నుంచి తప్పుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి.
ఆ తర్వాత రెండు వైపుల నుంచి పెద్దగా సౌండ్ లేదు. ‘మా’ కార్యకలపాలపై మీడియాలో కూడా పెద్దగా చర్చ లేదు. కాగా మళ్లీ ‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. మంచు విష్ణు మీద ప్రకాష్ రాజ్ ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించడం గమనార్హం. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు పనితీరు సున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘రెండేళ్లు అయిపోయాయి. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదు. విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలి. రెండేళ్లలో అతను ఏం చేశాడో చెప్పాలి. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేకపోయాడు. బోగస్ ఓట్లు, అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు.
కానీ రెండేళ్లలో అతడి పని తీరు సున్నా’’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. వచ్చే ‘మా’ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని.. ఎందుకంటే జాతీయ అంశాలపై తన దృష్టి ఉందని.. వీటన్నింటికీ తోడు సినిమాల పరంగా తనకు చాలా బిజీ షెడ్యూల్ ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. విష్ణు మీద విమర్శలను బట్టి ప్రకాష్ రాజ్ మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తాడని అనిపిస్తోంది కానీ.. తానెంత బిజీనో చెబుతుంటే మాత్రం సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on November 14, 2023 4:14 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…