నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాల లీకులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం గేమ్ ఛేంజర్ పాట ఆన్ లైన్ లో చేసిన రాద్ధాంతం చూశాం. ఎస్విసి లాంటి బ్యానర్ కంటెంట్ అంటే చాలా సెక్యూరిటీతో ఉంటుంది. అలాంటి సంస్థ నుంచే సాంగ్ బయటికి రావడం ఊహించని పరిణామం. దెబ్బకు ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకపోయినా దీపావళికి పాటని వదలాల్సి వస్తోంది. తాజాగా నిన్న సాయంత్రం గుంటూరు కారం వంతు వచ్చింది. ఆడియో స్పష్టంగా లేకపోయినా లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ విని ఈజీగా అది మహేష్ బాబుదేనని అందరికీ అర్థమైపోయింది.
సర్కారు వారి పాట టైంలోనూ కళావతి కళావతి అచ్చం ఇలాగే ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ తమన్ స్వరపరిచినవి. షూటింగ్ జరుగుతున్న టైంలో విపరీతమైన హైప్ నెలకొన్నవి. వందల కోట్ల పెట్టుబడులను భుజాల మీద మోస్తున్నవి. ప్రత్యేకంగా అతన్నే టార్గెట్ చేస్తున్నారా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కుట్ర చేశారాని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిమిషాల్లో అలెర్ట్ అయిపోయి అదే పనిగా వైరల్ చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్స్ ని గుర్తించి లీగల్ చర్యలకు సైతం వెనుకాడటం లేదు.
జరిగినదాన్ని ఎలాగూ ఆపలేం కానీ కనీసం ఇప్పుడైనా ఇలాంటివి జరగకుండా నిర్మాతలు జాగ్రత్త పడాలి.రాబోయే రోజుల్లో తెలుగు నుంచి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూలో ఉన్నాయి. డిసెంబర్ సలార్ తో మొదలుపెట్టి ఆగస్ట్ లో పుష్ప 2 దాకా బోలెడు దండయాత్ర చేయబోతున్నాయి. లీకులు చిన్నవో పెద్దవో అభిమానుల ఎగ్జైట్ మెంట్ నే కాదు కోట్లు పోసి కొన్న ఆడియో కంపెనీల ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. అసలు టెక్నికల్ టీమ్ దగ్గర మాత్రమే ఉండే కంటెంట్ ఎలా బయటికి వస్తుందో పోస్ట్ మార్టం చేయాల్సిందే. ముందుగా అలెర్ట్ అవ్వాల్సింది తమనే. తనకూ నష్టమే కాబట్టి.
This post was last modified on November 4, 2023 12:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…