దసరా పోటీలో విజేతగా నిలిచిన భగవంత్ కేసరి మొదటి స్థానం అందుకుంటే బ్రేక్ ఈవెన్, లాభాల పరంగా లియో సక్సెస్ ఫుల్ మూవీగా హిట్టు దక్కించుకుంది. బిజినెస్ కోణంలో రెండింటి రేంజ్ కి సంబంధం లేకపోయినా థియేటర్ల ఫుల్ లో పరస్పరం గట్టి ప్రభావం చూపించుకున్నాయి. కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రెండు విడుదల కావడంతో ఈ పరిణామం తప్పలేదు. ఇప్పుడు ఓటిటిలోనూ అచ్చం అదే విధంగా తలపడతాయని సమాచారం. బాలయ్య మూవీని నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ ప్రాథమికంగా నిర్ణయించినట్టు అంతర్గత వర్గాల సమాచారం
అప్పటికి నెల రోజుల రన్ దాటిపోయి ఉంటుంది కాబట్టి నాలుగు వారాల అగ్రిమెంట్ కి న్యాయం జరిగినట్టే. ఇక లియో నెట్ ఫ్లిక్స్ చేతిలో ఉంది. ఇన్ సైడ్ టాక్ బట్టి చూస్తే నవంబర్ 20 లేదా 22 రెండు ఆప్షన్స్ చూస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఏడాది హిట్ల కంటే డిజాస్టర్లను ఎక్కువగా కొన్న నెట్ ఫ్లిక్స్ కి దసరా లాంటి ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాప్ సినిమాలే దక్కాయి. అయితే జవాన్ లాంటి వెయ్యి కోట్ల మూవీ చేతిలో ఉండటం బంగారు బాతు అయ్యింది. నాని దసరా భారీ వ్యూస్ తెచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఖుషిలు మంచి స్పందన దక్కించుకున్నాయి. కానీ లియో రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది.
అన్నట్టు భగవంత్ కేసరి తెలుగుకే పరిమితం చేయకుండా ఇతర భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు పెడతారని తెలిసింది. బాలయ్య, శ్రీలీల ఎమోషనల్ కాంబో గురించి ఆన్ లైన్ లో చూసి తెలుసుకున్న ఇతర బాషల నెటిజెన్లు దీన్ని ఓటిటిలో చూసేందుకు రెడీ అవుతున్నారు. సో అతి తక్కువ గ్యాప్ లో బాలకృష్ణ, విజయ్ సినిమాలు కనువిందు చేయబోతున్నాయన్న మాట. మరి టైగర్ నాగేశ్వరరావు మాటేమిటి అనుకుంటున్నారా. వీటికన్నా ఓ రెండు వారాలు ముందే వచ్చేలా కాస్త ఎక్కువ రేట్ కి నిర్మాత అడిగినట్టు తెలిసింది. ఆ డీల్ ఓకే అయితే ప్రైమ్ లోనే మాస్ మహారాజాను త్వరగా చూడొచ్చు.
This post was last modified on November 1, 2023 7:40 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…