మాములుగా ఏ దర్శకుడైనా ఇండస్ట్రీకి తనను తాను ప్రూవ్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అందులోనూ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పుడు ఆ కిక్ వేరుగా ఉంటుంది. కానీ కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వ్యక్తే అల్ఫోన్స్ పుత్రేన్. మనకు అంతగా పరిచయం లేదు కానీ మళయాలంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమమ్ ని అత్యద్భుతంగా మలిచింది ఇతనే. తెలుగులో నాగ చైతన్య ఏరికోరి మరీ చందూ మొండేటి దర్శకత్వంలో రీమేక్ చేశాడు. ఒరిజినల్ అంత గొప్ప సక్సెస్ అందుకోలేదు కానీ మంచి హిట్టేనని చెప్పాలి.
ఇతనిప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కారణం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే ఇది మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లకు వచ్చే జబ్బు. ఇది వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించరు. ప్రతిదాని గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఫీలవ్వడం, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు. గత ఏడాది నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ లతో గోల్డ్ తీశాడు. ఇది దారుణంగా పోయింది. ఆ మాత్రం దానికే రివ్యూయర్లు మీద విరుచుకుపడి ప్రేక్షకుల మీద కూడా నానా రకాల కామెంట్లు చేశాడు.
కెరీర్ మొత్తంలో తీసింది మూడు సినిమాలే. ప్రేమమ్, గోల్డ్ కాకుండా నేరమ్ అని మరొకటి ఉంది. ఒక యాంతాలజిలో భాగం పంచుకున్నాడు. ఇకపై థియేటర్ కంటెంట్ కి దూరంగా ఉంటానని, ఓటిటి, యూట్యూబ్ కోసం మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తానని చెప్పిన అల్ఫోన్స్ పుత్రేన్ లాంటి యంగ్ ఫిలిం మేకర్ 39 ఏళ్ళ వయసుకే ఇలా సెలవు చెప్పడం విచారకరం. ఒకవేళ కోలుకున్నాక తిరిగి వస్తాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ అతను మాత్రం దేవుడిచ్చిన ట్విస్టుకి నేనేం చేయలేనంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తూ ఫైనల్ గా కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశాడు.
This post was last modified on October 30, 2023 10:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…