మాములుగా ఏ దర్శకుడైనా ఇండస్ట్రీకి తనను తాను ప్రూవ్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అందులోనూ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పుడు ఆ కిక్ వేరుగా ఉంటుంది. కానీ కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వ్యక్తే అల్ఫోన్స్ పుత్రేన్. మనకు అంతగా పరిచయం లేదు కానీ మళయాలంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమమ్ ని అత్యద్భుతంగా మలిచింది ఇతనే. తెలుగులో నాగ చైతన్య ఏరికోరి మరీ చందూ మొండేటి దర్శకత్వంలో రీమేక్ చేశాడు. ఒరిజినల్ అంత గొప్ప సక్సెస్ అందుకోలేదు కానీ మంచి హిట్టేనని చెప్పాలి.
ఇతనిప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కారణం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే ఇది మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లకు వచ్చే జబ్బు. ఇది వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించరు. ప్రతిదాని గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఫీలవ్వడం, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు. గత ఏడాది నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ లతో గోల్డ్ తీశాడు. ఇది దారుణంగా పోయింది. ఆ మాత్రం దానికే రివ్యూయర్లు మీద విరుచుకుపడి ప్రేక్షకుల మీద కూడా నానా రకాల కామెంట్లు చేశాడు.
కెరీర్ మొత్తంలో తీసింది మూడు సినిమాలే. ప్రేమమ్, గోల్డ్ కాకుండా నేరమ్ అని మరొకటి ఉంది. ఒక యాంతాలజిలో భాగం పంచుకున్నాడు. ఇకపై థియేటర్ కంటెంట్ కి దూరంగా ఉంటానని, ఓటిటి, యూట్యూబ్ కోసం మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తానని చెప్పిన అల్ఫోన్స్ పుత్రేన్ లాంటి యంగ్ ఫిలిం మేకర్ 39 ఏళ్ళ వయసుకే ఇలా సెలవు చెప్పడం విచారకరం. ఒకవేళ కోలుకున్నాక తిరిగి వస్తాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ అతను మాత్రం దేవుడిచ్చిన ట్విస్టుకి నేనేం చేయలేనంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తూ ఫైనల్ గా కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశాడు.
This post was last modified on October 30, 2023 10:49 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…