Movie News

3 సినిమాలకే కల్ట్ దర్శకుడి రిటైర్మెంట్

మాములుగా ఏ దర్శకుడైనా ఇండస్ట్రీకి తనను తాను ప్రూవ్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అందులోనూ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పుడు ఆ కిక్ వేరుగా ఉంటుంది. కానీ కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వ్యక్తే అల్ఫోన్స్ పుత్రేన్. మనకు అంతగా పరిచయం లేదు కానీ మళయాలంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమమ్ ని అత్యద్భుతంగా మలిచింది ఇతనే. తెలుగులో నాగ చైతన్య ఏరికోరి మరీ చందూ మొండేటి దర్శకత్వంలో రీమేక్ చేశాడు. ఒరిజినల్ అంత గొప్ప సక్సెస్ అందుకోలేదు కానీ మంచి హిట్టేనని చెప్పాలి.

ఇతనిప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కారణం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే ఇది మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లకు వచ్చే జబ్బు. ఇది వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించరు. ప్రతిదాని గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు  ఇబ్బందిగా ఫీలవ్వడం, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు. గత ఏడాది నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ లతో గోల్డ్ తీశాడు. ఇది దారుణంగా పోయింది. ఆ మాత్రం దానికే రివ్యూయర్లు మీద విరుచుకుపడి ప్రేక్షకుల మీద కూడా నానా రకాల కామెంట్లు చేశాడు.

కెరీర్ మొత్తంలో తీసింది మూడు సినిమాలే. ప్రేమమ్, గోల్డ్ కాకుండా నేరమ్ అని మరొకటి ఉంది. ఒక యాంతాలజిలో భాగం పంచుకున్నాడు. ఇకపై థియేటర్ కంటెంట్ కి దూరంగా ఉంటానని, ఓటిటి, యూట్యూబ్ కోసం మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తానని చెప్పిన అల్ఫోన్స్ పుత్రేన్ లాంటి యంగ్ ఫిలిం మేకర్ 39 ఏళ్ళ వయసుకే ఇలా సెలవు చెప్పడం విచారకరం. ఒకవేళ కోలుకున్నాక తిరిగి వస్తాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ అతను మాత్రం దేవుడిచ్చిన ట్విస్టుకి నేనేం చేయలేనంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తూ ఫైనల్ గా కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశాడు.

This post was last modified on October 30, 2023 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago