తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడిన హీరోయిన్ కంగనా రౌనత్ కు మంచి నటిగా పేరుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యే దర్శకులకు లోటే లేదు. క్వీన్ లాంటి మూవీస్ ని తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టిన ఘనతలు తనకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడంతా రివర్స్ లో నడుస్తోంది. కంగనా సోలోగా నటించిన చిత్రం ఏదైనా సరే కనీస ఓపెనింగ్స్ కి నోచుకోవడం లేదు. ఇవాళ తేజస్ రిలీజయ్యింది. మల్టీప్లెక్సుల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే దేశం మొత్తం మీద పట్టుమని నాలుగు వేల టికెట్లు అమ్ముడు కాకపోవడం విషాదం.
ఈ ఏడాది అత్యంత పెద్ద డిజాస్టర్స్ లో మొదటి స్థానం దక్కించుకున్న గణపథ్ కంటే అన్యాయంగా తేజస్ పెర్ఫార్మ్ చేయడం ఇంకో ట్రాజెడీ. టైగర్ శ్రోఫ్ మొదటి రోజు కనీసం ఓ రెండున్నర కోట్లు తెస్తే కంగనా కనీసం కోటిన్నరకే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికన్నా ముందు వచ్చిన ధాఖడ్, తలైవి, పంగా, జడ్జ్ మెంటల్ హై క్యా, రంగూన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఈమెనే నమ్ముకుని పి వాసు చంద్రముఖి 2 తీస్తే అన్ని భాషల్లో పరుగులు పెట్టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ విడుదలకు పలు అడ్డంకులు వస్తున్నాయి. డేట్ ఫైనల్ కాలేదు.
ఇంత బ్యాడ్ ఫామ్ ఉండటం ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ కు ఇబ్బంది కలిగించేదే. ఇకపై మార్కెట్ లో తన సినిమాలకు పెట్టుబడులు కష్టమే. గత కొన్నేళ్లలో ఒక్క మణికర్ణిక మాత్రమే డీసెంట్ సక్సెస్ అందుకుంది. అది కూడా దర్శకుడు క్రిష్ నుంచి బాధ్యతలు తీసుకుని తనే స్వయంగా డైరెక్ట్ చేసుకుని వివాదాలు రేపడం ఎవరూ మర్చిపోలేదు. బాలీవుడ్ విశ్లేషకులు మాత్రం కంగనా కెరీర్ ముగింపులో ఉందని, దగ్గర్లో పెద్ద బ్రేక్ దొరకడం కష్టమేనని తేల్చేస్తున్నారు. ఇంతా జరిగి తేజస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తే ఊరట అనుకోవచ్చు. టాక్ చాలా బ్యాడ్ గా ఉండటం ఇంకో ఝలక్ ఇచ్చేలా ఉంది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…