తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడిన హీరోయిన్ కంగనా రౌనత్ కు మంచి నటిగా పేరుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యే దర్శకులకు లోటే లేదు. క్వీన్ లాంటి మూవీస్ ని తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టిన ఘనతలు తనకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడంతా రివర్స్ లో నడుస్తోంది. కంగనా సోలోగా నటించిన చిత్రం ఏదైనా సరే కనీస ఓపెనింగ్స్ కి నోచుకోవడం లేదు. ఇవాళ తేజస్ రిలీజయ్యింది. మల్టీప్లెక్సుల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే దేశం మొత్తం మీద పట్టుమని నాలుగు వేల టికెట్లు అమ్ముడు కాకపోవడం విషాదం.
ఈ ఏడాది అత్యంత పెద్ద డిజాస్టర్స్ లో మొదటి స్థానం దక్కించుకున్న గణపథ్ కంటే అన్యాయంగా తేజస్ పెర్ఫార్మ్ చేయడం ఇంకో ట్రాజెడీ. టైగర్ శ్రోఫ్ మొదటి రోజు కనీసం ఓ రెండున్నర కోట్లు తెస్తే కంగనా కనీసం కోటిన్నరకే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికన్నా ముందు వచ్చిన ధాఖడ్, తలైవి, పంగా, జడ్జ్ మెంటల్ హై క్యా, రంగూన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఈమెనే నమ్ముకుని పి వాసు చంద్రముఖి 2 తీస్తే అన్ని భాషల్లో పరుగులు పెట్టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ విడుదలకు పలు అడ్డంకులు వస్తున్నాయి. డేట్ ఫైనల్ కాలేదు.
ఇంత బ్యాడ్ ఫామ్ ఉండటం ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ కు ఇబ్బంది కలిగించేదే. ఇకపై మార్కెట్ లో తన సినిమాలకు పెట్టుబడులు కష్టమే. గత కొన్నేళ్లలో ఒక్క మణికర్ణిక మాత్రమే డీసెంట్ సక్సెస్ అందుకుంది. అది కూడా దర్శకుడు క్రిష్ నుంచి బాధ్యతలు తీసుకుని తనే స్వయంగా డైరెక్ట్ చేసుకుని వివాదాలు రేపడం ఎవరూ మర్చిపోలేదు. బాలీవుడ్ విశ్లేషకులు మాత్రం కంగనా కెరీర్ ముగింపులో ఉందని, దగ్గర్లో పెద్ద బ్రేక్ దొరకడం కష్టమేనని తేల్చేస్తున్నారు. ఇంతా జరిగి తేజస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తే ఊరట అనుకోవచ్చు. టాక్ చాలా బ్యాడ్ గా ఉండటం ఇంకో ఝలక్ ఇచ్చేలా ఉంది.
This post was last modified on October 27, 2023 2:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…