న్యాచురల్ స్టార్ నాని 31వ సినిమా అధికారికంగా ప్రకటించారు. సరిపోదా శనివారం టైటిల్ మొన్నే లీకైనా ఏమైనా మార్పు ఉండొచ్చేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా అదే అనౌన్స్ చేశారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండా ప్రత్యేకంగా రెండు నిమిషాల టీజర్ కోసమే స్పెషల్ షూట్ చేయడం విశేషం. ఆ మధ్య నాగార్జున నా సామి రంగా నుంచి ఇదో కొత్త ట్రెండ్ గా మారుతోంది. డివివి దానయ్య నిర్మాతగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ ని ఎక్కువ రివీల్ కాకుండా టీజర్ ని కట్ చేసి సస్పెన్స్ లో ఉంచారు.
జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప రోజు వస్తుంది. దాన్ని పెద్దవాళ్ళు ఒకరకంగా చెబితే ఇప్పటి తరం ఇంకోలా మార్చేసి ఆ డేట్ వచ్చే దాకా మూసుకుని ఉండమని చెబుతారు. ఒక్కసారిగా మలుపు తిప్పే దాని కోసం ఎదురు చూడటం అందరూ చేసేదే. అయితే అలాంటి రోజు ప్రతి శనివారం ఒకడికి వస్తే దాన్నేమంటారు. వెరైటీగా ఉంది కదా. ఓ పాడుబడిన షెడ్డు లాంటి చోట కాళ్లకు సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఓ యువకుడు వాటిని పీఠకత్తితో తెంచుకుని బయటికి వస్తాడు. తన కోసం ఎదురు చూస్తున్న ఊరి జనం ముందు ప్రత్యక్షమవుతాడు. అసలేం జరిగిందో తెలియాలంటే ఆగాలి.
దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా విభిన్నంగా టీజర్ ని ప్రెజెంట్ చేశాడు. ఏదో ఊరికి సంబంధించిన ట్విస్టు, ప్రతి శనివారం నాని జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పు చుట్టూ డిఫరెంట్ పాయింట్ అయితే రాసుకున్న క్లారిటీ వచ్చేసింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సరిపోలేదా శనివారంకు జెక్స్ బెజోయ్ సంగీతం, జి మురళి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మెయిన్ విలన్ గా ఎస్జె సూర్యని నిన్నే ప్రకటించారు. క్వాలిటీ క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న సరిపోదా శనివారం ప్రస్తుతం నాని చేస్తున్న హాయ్ నాన్నకు పూర్తిగా డిఫరెంట్ జానర్ లో రానుంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…