న్యాచురల్ స్టార్ నాని 31వ సినిమా అధికారికంగా ప్రకటించారు. సరిపోదా శనివారం టైటిల్ మొన్నే లీకైనా ఏమైనా మార్పు ఉండొచ్చేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా అదే అనౌన్స్ చేశారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండా ప్రత్యేకంగా రెండు నిమిషాల టీజర్ కోసమే స్పెషల్ షూట్ చేయడం విశేషం. ఆ మధ్య నాగార్జున నా సామి రంగా నుంచి ఇదో కొత్త ట్రెండ్ గా మారుతోంది. డివివి దానయ్య నిర్మాతగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ ని ఎక్కువ రివీల్ కాకుండా టీజర్ ని కట్ చేసి సస్పెన్స్ లో ఉంచారు.
జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప రోజు వస్తుంది. దాన్ని పెద్దవాళ్ళు ఒకరకంగా చెబితే ఇప్పటి తరం ఇంకోలా మార్చేసి ఆ డేట్ వచ్చే దాకా మూసుకుని ఉండమని చెబుతారు. ఒక్కసారిగా మలుపు తిప్పే దాని కోసం ఎదురు చూడటం అందరూ చేసేదే. అయితే అలాంటి రోజు ప్రతి శనివారం ఒకడికి వస్తే దాన్నేమంటారు. వెరైటీగా ఉంది కదా. ఓ పాడుబడిన షెడ్డు లాంటి చోట కాళ్లకు సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఓ యువకుడు వాటిని పీఠకత్తితో తెంచుకుని బయటికి వస్తాడు. తన కోసం ఎదురు చూస్తున్న ఊరి జనం ముందు ప్రత్యక్షమవుతాడు. అసలేం జరిగిందో తెలియాలంటే ఆగాలి.
దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా విభిన్నంగా టీజర్ ని ప్రెజెంట్ చేశాడు. ఏదో ఊరికి సంబంధించిన ట్విస్టు, ప్రతి శనివారం నాని జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పు చుట్టూ డిఫరెంట్ పాయింట్ అయితే రాసుకున్న క్లారిటీ వచ్చేసింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సరిపోలేదా శనివారంకు జెక్స్ బెజోయ్ సంగీతం, జి మురళి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మెయిన్ విలన్ గా ఎస్జె సూర్యని నిన్నే ప్రకటించారు. క్వాలిటీ క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న సరిపోదా శనివారం ప్రస్తుతం నాని చేస్తున్న హాయ్ నాన్నకు పూర్తిగా డిఫరెంట్ జానర్ లో రానుంది.
This post was last modified on October 23, 2023 1:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…