పఠాన్,జవాన్, టైగర్ 3 తర్వాత బాలీవుడ్ లో మళ్ళీ అంతే అంచనాలున్న సినిమా అనిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడంతో ఇతర భాషల్లోనూ దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బ్రాండ్ బాగా పని చేస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ చూశాక ఒక్కసారిగా బిజినెస్ వర్గాల్లో హైప్ వచ్చేసింది. ముందు సౌమ్యుడిగా ఉంటూ తర్వాత తండ్రి కోసం మరణ శాసనాలు రాసే గ్యాంగ్ స్టర్ గా మారిపోయే క్రమాన్ని సందీప్ ఇంటెన్స్ గా తెరకెక్కించాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. అయితే కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నారనే కామెంట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
బాగా వైరలైన సీన్లలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్నను ఫ్లైట్ కాక్ పిట్ లో లిప్ లాక్ కిస్ చేసుకోవడం ఒకటి. ఇది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఫిఫ్టీ షేడ్స్ అఫ్ గ్రేలో హెలికాఫ్టర్ సన్నివేశం లాగే ఉందని నెటిజెన్లు ఉదాహరణగా చెబుతున్నారు. తడిసిన చొక్కాతో చేతిలో చిన్న గొడ్డలి పట్టుకుని హీరో చేసే ఊచకోత కూడా కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ నుంచి తీసుకున్నదని పోలికలు చూపిస్తున్నారు. నిజానికి ఇలాంటి మాఫియా కథలు అన్నింటికి రెఫెరెన్స్ బుక్ లాగా ఫ్రాన్సిస్ కొప్పుల గాడ్ ఫాదర్. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సక్సెస్ ఫుల్ బ్లాక్ బస్టర్లు వచ్చాయో చెప్పడం కష్టం.
కాబట్టి అనిమల్ లో కేవలం కొన్ని సెకండ్ల ఫుటేజ్ చూసి వెంటనే ఒక నిర్ధారణకు రాలేం. కబీర్ సింగ్ టైంలో కేవలం సౌత్ డైరెక్టరనే ఉద్దేశంతో ఆ సినిమాని చాలా నెగటివ్ గా రివ్యూ చేసిన కొందరు ముంబై మీడియా ప్రముఖులు ఆ తర్వాత దానికి వచ్చిన రెండు వందల కోట్ల వసూళ్లు చూసి సైలెంట్ అయిపోయారు. అది చూసే టి సిరీస్ ఇంత భారీ బడ్జెట్ తో అనిమల్ తీసే ఛాన్స్ ఇచ్చింది. ఇది రిలీజ్ అయ్యాక ప్రభాస్ స్పిరిట్ తాలూకు స్క్రిప్ట్ పనులు మొదలుకాబోతున్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు, చిరంజీవి, షారుఖ్ ఖాన్ లలో ఒకరితో ప్రాజెక్టు లాక్ అయ్యే ఛాన్స్ ఉందని వినికిడి.
This post was last modified on October 18, 2023 7:07 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…