ఎందరో మహానుభావులు ఒకప్పుడు. అందుకే అందరికీ వందనం పెట్టాలనిపించేది. కానీ ఇప్పుడు కొందరు కూడా కరువైపోయారు. ఇదంతా దేని గురించని అనుకుంటున్నారా. అసలు పాయింట్ కు వెళ్లే ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. 1980 తర్వాత తమిళం నుంచి తెలుగు సినిమాల డబ్బింగ్ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇళయరాజా, రెహమాన్ ల శకం దీన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. అనువాద సాహిత్యమైనా సరే అద్భుతమైన విలువలతో రాజశ్రీ గారు రాసేవారు. 1994 ప్రేమికుడు దాకా ఆయన రాసిన ఎవర్ గ్రీన్ లిరిక్స్ శాశ్వతంగా సంగీత ప్రియుల మనసుల్లో ముద్రించుకుపోయాయి.
తర్వాత వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి లాంటి లబ్దప్రతిష్టులు డబ్బింగ్ పాటల్లో తమ వంతుగా ఎంతో గొప్ప పల్లవులు, చరణాలు ఇచ్చారు. ఇప్పుడదంతా గతంగా మారిపోయింది. ఊరికే పదాలు రాయించి అక్కడక్కడా ప్రాసలు కుదిరాయో లేదో చూసుకుని మమ అనిపిస్తున్నారు. తాజాగా వచ్చిన లియో నే రెడీనే తెలుగు వెర్షన్ వాయిద్యాల హోరులో అసలేం పదాలు ఉన్నాయో గుర్తు పట్టలేనంత విచిత్రంగా ఉన్నాయి. ఎంత ఫాస్ట్ బీట్ లో సాగే పాట అయినప్పటికీ మరీ ఇలాంటి లిరిక్స్ రాయిస్తారా అంటూ మ్యూజిక్ లవర్స్ ఆన్ లైన్ వేదికగా భగ్గుమంటున్నారు.
ఈ పోకడ కేవలం లియోతో మొదలయ్యింది కాదు. గత పదేళ్లుగా చాలా సినిమాల్లో ఇదే తంతు. గతంలో ఏఆర్ రెహమాన్ అనువాదమైనా సరే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాటల అర్థం తెలుసుకుని ఓకే చేసేవాడు. ఇప్పుడంత ఓపిక లేదు. పెద్ద రచయితలకు లక్షలు ఇచ్చి రాయించుకోవడం కన్నా ఎవరో ఒకరితో మేనేజ్ చేస్తే చాలనే రీతిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అజిత్, రజినీకాంత్, విజయ్, శివ కార్తికేయన్ ఒకరిద్దరిని కాదు అందరిదీ ఇదే తంతు. గత పదేళ్లలో బెస్ట్ డబ్బింగ్ సాంగ్స్ ఒక పది వెంటనే పాడమంటే నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరో వేరే చెప్పాలా.
This post was last modified on October 13, 2023 8:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…