ఎందరో మహానుభావులు ఒకప్పుడు. అందుకే అందరికీ వందనం పెట్టాలనిపించేది. కానీ ఇప్పుడు కొందరు కూడా కరువైపోయారు. ఇదంతా దేని గురించని అనుకుంటున్నారా. అసలు పాయింట్ కు వెళ్లే ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. 1980 తర్వాత తమిళం నుంచి తెలుగు సినిమాల డబ్బింగ్ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇళయరాజా, రెహమాన్ ల శకం దీన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. అనువాద సాహిత్యమైనా సరే అద్భుతమైన విలువలతో రాజశ్రీ గారు రాసేవారు. 1994 ప్రేమికుడు దాకా ఆయన రాసిన ఎవర్ గ్రీన్ లిరిక్స్ శాశ్వతంగా సంగీత ప్రియుల మనసుల్లో ముద్రించుకుపోయాయి.
తర్వాత వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి లాంటి లబ్దప్రతిష్టులు డబ్బింగ్ పాటల్లో తమ వంతుగా ఎంతో గొప్ప పల్లవులు, చరణాలు ఇచ్చారు. ఇప్పుడదంతా గతంగా మారిపోయింది. ఊరికే పదాలు రాయించి అక్కడక్కడా ప్రాసలు కుదిరాయో లేదో చూసుకుని మమ అనిపిస్తున్నారు. తాజాగా వచ్చిన లియో నే రెడీనే తెలుగు వెర్షన్ వాయిద్యాల హోరులో అసలేం పదాలు ఉన్నాయో గుర్తు పట్టలేనంత విచిత్రంగా ఉన్నాయి. ఎంత ఫాస్ట్ బీట్ లో సాగే పాట అయినప్పటికీ మరీ ఇలాంటి లిరిక్స్ రాయిస్తారా అంటూ మ్యూజిక్ లవర్స్ ఆన్ లైన్ వేదికగా భగ్గుమంటున్నారు.
ఈ పోకడ కేవలం లియోతో మొదలయ్యింది కాదు. గత పదేళ్లుగా చాలా సినిమాల్లో ఇదే తంతు. గతంలో ఏఆర్ రెహమాన్ అనువాదమైనా సరే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాటల అర్థం తెలుసుకుని ఓకే చేసేవాడు. ఇప్పుడంత ఓపిక లేదు. పెద్ద రచయితలకు లక్షలు ఇచ్చి రాయించుకోవడం కన్నా ఎవరో ఒకరితో మేనేజ్ చేస్తే చాలనే రీతిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అజిత్, రజినీకాంత్, విజయ్, శివ కార్తికేయన్ ఒకరిద్దరిని కాదు అందరిదీ ఇదే తంతు. గత పదేళ్లలో బెస్ట్ డబ్బింగ్ సాంగ్స్ ఒక పది వెంటనే పాడమంటే నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరో వేరే చెప్పాలా.
This post was last modified on October 13, 2023 8:34 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…