సరిగ్గా ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోయే భగవంత్ కేసరి కోసం నందమూరి అభిమానుల ఎదురు చూపులు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. కమర్షియల్ అంశాలు పెడుతూనే రెగ్యులర్ హీరోయిన్ డ్యూయెట్లకు దూరంగా ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి మంచి కంటెంట్ తో రూపొందించినట్టు ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చేశారు. వయసు మళ్ళిన క్యారెక్టర్ లో బాలయ్య కనిపిస్తున్నా ఫ్లాష్ బ్యాక్ తో సహా ఇందులో ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని టీమ్ ఊరిస్తోంది. ఫ్యాన్స్ ఊహించని మరో ట్విస్టు మొదటి వారం దాచి పెడుతున్నారు.
ఆల్ టైం ఎవర్ గ్రీన్ క్లాసిక్ మంగమ్మ గారి మనవడులో దంచవే మేనత్త కూతురా పాట రీమిక్స్ ని స్పెషల్ గా మొదటి వారం చివర్లో దసరా పండగ కానుకగా థియేటర్లలో జోడించబోతున్నారు. ముందుగా చూసే ఆడియన్స్ కి ఒరిజినల్ ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఆలోచన చేశామని, రెండోసారి వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పాట ఉపయోగపడుతుందని అనిల్ చెబుతున్నారు. ఐడియా బాగానే ఉంది. ఎలాగూ హిట్ టాక్ వస్తే ఫ్యాన్స్ రెండు మూడు సార్లు ఈజీగా చూస్తారు. అలాంటిది దంచవే లాంటి ఛార్ట్ బస్టర్ సాంగ్ ని మళ్ళీ బోనస్ గా ఇస్తామంటే వెళ్లకుండా ఊరుకుంటారా.
పోటీ సంగతి ఎలా ఉన్నా భగవంత్ కేసరి మీద మాస్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. కెరీర్లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి గత సినిమాల కన్నా బెస్ట్ దీనికి ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. విజయదశమికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే అవుతుందన్న నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. శ్రీలీల సెంటిమెంట్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చెన్నకేశవరెడ్డిని తలపించేలా బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇవన్నీ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. అక్టోబర్ 19న తెల్లవారుఝాము నుంచి షోలు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు రావాలి.
This post was last modified on October 13, 2023 10:54 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…