ఏజెంట్ ఫలితం అఖిల్ ని బాగా డిఫెన్స్ లో పడేసింది. ఒకవేళ యావరేజ్ అయినా ఈపాటికి కొత్త సినిమా మొదలుపెట్టేవాడేమో కానీ దాని దెబ్బకు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ దర్శకుడిగా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్న సంగతి వేసవి ముందే లీక్ అయ్యింది. కానీ ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలేదు. ఉంటుందా ఉండదా అనే డౌట్ అక్కర్లేదు. కన్ఫర్మ్ అయ్యింది కానీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఏవో కీలక మార్పుల వల్ల కొంత లేటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. విరూపాక్ష రూపంలో డెబ్యూ తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు ఈ మద్యే అఖిల్ కి ఒక లైన్ చెప్పాడని సమాచారం. అయితే కేవలం ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా నిర్ధారణ కాలేదు. ముందు విరూపాక్ష 2 పూర్తి చేయాలి. అఫీషియల్ గా ప్రకటించినా హీరో ఎవరో ఫైనల్ కాలేదు. సాయి ధరమ్ తేజ్ చేసే పరిస్థితిలో లేడు. ఆరేడు నెలలు విశ్రాంతి తీసుకుని తర్వాత కథలు వినాలని డిసైడయ్యాడు. అప్పటిదాకా కార్తీక్ వెయిట్ చేయడం ఇబ్బందే. అందుకే తన స్థానంలో విరూపాక్ష 2ని అఖిల్ తో చేసే ఆలోచన ఏమైనా జరుగుతుందేమో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
వీలైనంత త్వరగా అఖిల్ ఏదో ఒకటి మొదలు పెట్టడం అవసరం. నాగార్జున నా సామీ రంగాలో బిజీ అయ్యారు. నాగ చైతన్య దర్శకుడు చందూ మొండేటి కోసం ప్రీ ప్రొడక్షన్ లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు. సుమంత్, సుశాంత్ లు సైతం చేతిలో ఒకటి రెండు సినిమాలు, తమ దగ్గరికి వస్తున్న దర్శకులు దేనికీ నో చెప్పడం లేదు. ఏజెంట్ పోయింది. అఖిల్ ఒక్కడికే కాదు టాలీవుడ్ లో ఉన్న ప్రతి స్టార్ హీరోకి అలాంటి డిజాస్టర్లు బోలెడున్నాయి. అలాంటప్పుడు మరీ ఎక్కువ ఆత్మపరీశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనిపోని ప్రచారాలకు చెక్ పడాలంటే కింగ్ రెండో వారసుడు పరుగులు పెట్టాల్సిందే.
This post was last modified on October 11, 2023 7:25 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…