టాలీవుడ్లో భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ అంటే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందు వరుసలో నిలబడతాడు. క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కే భారీ చిత్రాలను చాలా వరకు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. సినిమాల ఫలితాలను, వాటి మార్కెట్ రీచ్ను సరిగ్గా అంచనా వేసి, రికార్డు రేట్లు పెట్టి కొనడం రాజుకు అలవాటు. ఆ రేటును గిట్టుబాటు చేసేలా రిలీజ్ ప్లానింగ్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటాడు.
ఆయన చేతికి సినిమాను అప్పగిస్తే నిర్మాతలు కళ్లు మూసుకుని మిగతా పనులు చూసుకోవచ్చు అన్నట్లుంటుంది. రిలీజ్ పరంగా కానీ, పేమెంట్ విషయంలో కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటాడనే పేరు రాజుకు ఉంది. అందుకే ఎక్కువగా పెద్ద సినిమాల డీల్స్ రాజు చేతికే వెళ్తుంటాయి. టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ రిలీజ్ ‘సలార్’ను దిల్ రాజే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆయనే నైజాం ఏరియాకు హైయెస్ట్ రేట్ కోట్ చేశాడని.. డీల్ ఓకే కావడం లాంఛనమే అని వార్తలు వచ్చాయి.
కానీ రాజుతో పాటు అందరికీ పెద్ద షాకిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ‘సలార్’ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుందన్నది తాజా సమాచారం. రాజుకు హక్కులు వెళ్లడం లాంఛనమే అనుకున్న స్థితిలో మైత్రీ అనూహ్యంగా రేసులోకి వచ్చి రైట్స్ను తన్నుకుపోయింది. నైజాంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న రాజుకు చెక్ పెడుతూ ఏడాది కిందటే కొత్తగా డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసింది మైత్రీ సంస్థ.
తమ బేనర్లో తెరకెక్కిన సంక్రాంతి సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను ఆ సంస్థ నుంచే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మైత్రీ డిస్ట్రిబ్యూషన్లో అంతగా యాక్టివ్గా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ‘సలార్’ లాంటి క్రేజీ మూవీని దక్కించుకుని మైత్రీ సంచలనం రేపింది. దిల్ రాజు రూ.65 కోట్ల రేటు కోట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా మైత్రీ వాళ్లకు హక్కులు వెళ్లాయంటే ఐదు పది కోట్లు ఎక్కువే ఇచ్చి తీసుకున్నారన్నమాట. మరి ఇంత రేటును వర్కవుట్ చేసి లాభాలు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు.
This post was last modified on October 10, 2023 4:50 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…