జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న దేవరకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ దర్శకుడు కొరటాల శివ నుంచి స్వయంగా వీడియో రూపంలో వచ్చేసింది. అందరూ ఊహించినట్టు దేవర ఒక్క భాగం కాదు. సీక్వెల్ కూడా ఉండబోతోంది. దానికి కారణాలు వివరించిన కొరటాల ఇంత గొప్ప కథని రెండున్నర గంటల్లో చెప్పలేమని, ప్రతి పాత్ర, సన్నివేశం డిటైలింగ్ డిమాండ్ చేయడంతో అనిర్వచనీయమైన అనుభూతిని ఇవ్వడం కోసం కొనసాగింపు ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు అఫీషియల్ గా చెప్పారు. సో దేవరని రెండుసార్లు చూడబోతున్నామన్న మాట.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 మొదటి భాగం విడుదలవుతుందని చెప్పిన కొరటాల శివ దేవర 2కి సంబంధించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. నిజానికి ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి కంటిన్యుయేషన్ అవసరమే. బాహుబలి, కెజిఎఫ్ లాంటివి ఈ కారణంగానే గొప్ప విజయాన్ని అందుకుని వేలకోట్ల వసూళ్లు చవిచూశాయి. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న దేవరను సైతం ఆ రేంజ్ లో చూడాలని జూనియర్ ఫ్యాన్స్ కోరుకోవడం అత్యాశ కాదు. ఏదైతేనేం ఫైనల్ గా సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడో విషయం అర్థం చేసుకోవచ్చు. దేవరలో తారక్ డ్యూయల్ రోలని గతంలోనే లీక్ వచ్చింది. అంటే తండ్రి కొడుకుల షేడ్స్ ని విడివిడిగా చూసే ఛాన్స్ రావొచ్చు. అయితే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదానేది ఇంకా తేలాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రెండు పాత్రలు యువకులుగానే కనిపిస్తాయని బాహుబలిలో ప్రభాస్ టైపు ట్రీట్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇవేవి అంత సులభంగా నమ్మడానికి లేదు కానీ కనీసం ఒక టీజర్ వచ్చాక కొంత అవగాహనకు రావొచ్చు. దేవర 2 ఎలా చూసుకున్నా 2025 వేసవి తర్వాతే విడుదల ఉంటుంది. షూటింగ్ సమాంతరంగా జరుగుతుందేమో చూడాలి.
This post was last modified on October 7, 2023 8:03 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…