నిన్న జరిగిన రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది మరోసారి హైలైటయ్యాడు. మాములుగా తగినంత టైం, మైక్ ఇస్తే ఓ రేంజ్ లో ఎలివేషన్లతో ఊపేసే ఈ హాస్య నటుడు వెరైటీగా అసలు హీరో కిరణ్ అబ్బవరం గురించి కాకుండా స్టార్లు, వారసులు, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాల గురించి ఏకంగా పావు గంట సేపు మాట్లాడ్డం వచ్చినవాళ్లకేమో కానీ మిగిలిన అభిమానులకు మాత్రం మంచి గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చేశాయి. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి తారక్, చరణ్, బన్నీ, మహేష్ బాబు, ప్రభాస్ దాకా ఎవరినీ వదలకుండా అందరనీ కవర్ చేశాడు.
అంతసేపు రూల్స్ రంజన్ కి సంబంధం లేని టాపిక్ గురించి హైపర్ ఆది మాట్లాడ్డం ఆశ్చర్యంగానే ఉన్నా దీని వల్ల కలిగిన ప్రయోజనాలు రెండున్నాయి. మొదటిది ఈ స్పీచ్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. ఎవరికి వారు తమ హీరోల తాలూకు వెర్షన్లను కట్ చేసుకుని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. రెండు కిరణ్ అబ్బవరంని టార్గెట్ చేసుకుంటున్న ట్రోల్స్ ని ఉద్దేశించి ఇతనూ భవిష్యత్తులో స్టార్ అవుతాడనే సంకేతం బలంగా ఇవ్వడం. ఇవి రెండూ పబ్లిసిటీకి ఉపయోగపడేవే. అక్టోబర్ 6 విపరీతమైన పోటీ నేపథ్యంలో ఇది అవసరమే.
సో ఏ ఉద్దేశంతో మాట్లాడినా కోరుకున్న కార్యమైతే నెరవేరింది. ప్రత్యేకంగా స్పెషల్ స్టార్ గెస్ట్ ఎవరూ లేకపోవడంతో రూల్స్ రంజన్ బృందానికి వాళ్లకు వాళ్ళే అతిథులయ్యారు. కొడుకే దర్శకుడు కావడంతో నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త విడత వారాహి యాత్ర ఉండటంతో పవర్ స్టార్ డ్రాప్ అయ్యారు. దీంతో ఛాన్స్ మిస్ అయ్యింది. లేదంటే హైప్ ఇంకో లెవెల్ కు వెళ్ళేది. నవ్వించడమే లక్ష్యంగా రూల్స్ రంజన్ తీశామని కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మీటర్ గాయాన్ని మానిపోయేలా చేయాల్సింది ఈ సినిమానే.
This post was last modified on October 1, 2023 11:44 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…