Movie News

ప్లానింగ్ దాచి పెడుతున్న డుంకీ

నిన్న సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 ప్రకటించాక షారుఖ్ ఖాన్ అభిమానులు డుంకీ టీమ్ నుంచి అగ్రెసివ్ ప్రమోషన్లు ఆశిస్తున్నారు. యుఎస్ లో ప్రభాస్ డిస్ట్రిబ్యూటర్లు 1979కి పైగా లొకేషన్లలో స్క్రీన్లు లాక్ చేశామని ప్రకటించడంతో ఒక్కసారిగా ఓవర్సీస్ ట్రేడ్ అలెర్ట్ అయిపోయింది. అదే సమయంలో పెద్ద హాలీవుడ్ సినిమాలున్నా కూడా అంత భారీ స్థాయిలో థియేటర్లను పట్టడమంటే మాములు విషయం కాదు. ఎందుకంటే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డంని నిర్మించిన వార్నర్ బ్రోస్ చాలా ముందస్తుగా బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకుని ఉంటుంది. కాబట్టి వ్యవహారం అంత తేలికగా ఉండదు.

ఇన్ని జరుగుతున్నా డుంకీ ప్రొడ్యూసర్లు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. పఠాన్, జవాన్ వరస బ్లాక్ బస్టర్ల తర్వాత ఒక్కసారి షారుఖ్ ఖాన్ మార్కెట్ అమాంతం లేచి కూర్చుంది. ఒకప్పుడు విదేశాలను ఏలిన బాద్షాకు మళ్ళీ పాత రోజులు వచ్చాయని అభిమానులు సంబరపడ్డారు. సహజంగానే డుంకీ మీద విపరీతమైన బజ్ వచ్చేస్తుంది. దానికి తోడు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో ఇవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. హైప్ ఎంత ఉన్నా సలార్ లాంటి డైనోసర్ ముందున్నప్పుడు దాన్ని ఎదురుకోవడానికి సరైన ప్రణాళిక ఉండాలి. కానీ ఎందుకనో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు

డుంకిని షారుఖ్ ఖాన్ నిర్మాణంలో భార్య గౌరీతో పాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, వయాకామ్ 18లు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. డిసెంబర్ 22కి కట్టుబడి ఉన్నామని షారుఖ్ పలు సందర్భాల్లో, ఇంటర్వ్యూలలో చెబుతున్నాడు కానీ మిగిలిన ఇద్దరి నుంచి దానికి సంబంధించిన ఎలాంటి మాట రావడం లేదు. వాయిదా పడొచ్చనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో ఉన్నప్పటికీ కింగ్ ఖాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే సలార్ లో ఉన్నంత యాక్షన్ మాస్ డుంకీలో ఉండదు కానీ అలాని మరీ తక్కువంచనా వేయడమూ సరికాదు.

This post was last modified on September 30, 2023 12:15 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

23 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago