లాక్ డౌన్ కారణంగా ఐదు నెలలకు పైగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. వాటిపై నిషేధం ఇంత కాలం కొనసాగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అన్నింటికంటే చివరగా అనుమతి ఇచ్చేది థియేటర్లకే అని ముందే అంచనా వేశారు కానీ.. మరీ ఇంత ఆలస్యమవుతుందని ఊహించలేదు.
లాక్ డౌన్ షరతులు సడలించినపుడల్లా థియేటర్లకు అవకాశమిస్తారేమో అని చూసిన వాళ్లకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఇప్పుడు థియేటర్లకు ప్రభుత్వం అనుమతులిచ్చేసినప్పటికీ.. ఈ ఏడాది థియేటర్లలో వంద శాతం కెపాసిటీతో సినిమాలు ఆడటం కలే అన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.
ఈ అభిప్రాయానికి వచ్చాకే తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్న వాళ్లు కూడా దిగి వచ్చారు. తెలుగులో సైతం ‘వి’ సహా కొన్ని పేరున్న సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయబోతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఆల్రెడీ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు.
అక్కడ గులాబో సితాబో, దిబ్ బేచారా, శకుంతలా దేవి లాంటి పెద్ద సినిమాలు ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. ఇంకా లక్ష్మీబాంబ్, బుజ్: ది ప్రైడ్, సడక్-2 లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటితో పాటే విడుదలకు సిద్ధంగా ఉన్న సూర్యవంశీ, 83 సినిమాల మేకర్స్ మాత్రం తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసే అవకాశం లేదని ఇంతకుముందు ప్రకటించారు.
కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వీటికి కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీల్లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ రెండు సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయిన రిలయన్స్ సంస్థ మాత్రం అందుకు అవకాశం లేదని తేల్చేసింది.
థియేటర్ల పరిస్థితి త్వరలోనే మెరుగు పడుతుందని.. ఈ రెండు చిత్రాలను దీపావళి, క్రిస్మస్ సీజన్లలో వేర్వేరుగా రిలీజ్ చేయగలమనే ఆశాభావంతో ఉన్నామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ రెండు పండుగల సమయంలో కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో నడవని పరిస్థితే ఉంటే.. అప్పుడేం చేస్తారో చూడాలి మరి.
This post was last modified on August 23, 2020 6:04 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…