అభిషేక్ నామా అని టాలీవుడ్లో పేరున్న నిర్మాత. ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్ను సవాల్ చేసిన వ్యక్తి ఇతను. వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ మధ్య ఈ నిర్మాత నెగెటివ్ న్యూస్లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి తనకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందని.. అభిమానులకు కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ తనకు కూడా న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభిషేక్ సంస్థ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. ఏదైనా ఉంటే నిర్మాతతో సెటిల్ చేసుకోవాలి కానీ.. ఇలా ట్విట్టర్లో హీరోను టార్గెట్ చేయడం ఏంటని అభిషేక్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్వీట్ బూమరాంగ్ అయిందన్నది స్పష్టం. ఇప్పుడు మరోసారి అభిషేక్ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు దర్శకుడిగా తన పేరే వేసుకుని పోస్టర్లు రిలీజ్ చేయడమే ఇందుక్కారణం. ముందు ఈ సినిమా నవీన్ మేడారం డైరక్షన్లో మొదలైంది. పోస్టర్ మీద రైటర్ కమ్ డైరెక్టర్గా తన పేరే ఉంది.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. దర్శకుడిగా తన పేరు తొలగించి అభిషేక్ పిక్చర్స్ టీమ్ అని వేశారు. కానీ కొత్త పోస్టర్లో ఏమో దర్శకుడిగా అభిషేక్ నామా పేరు పడిపోయింది. నవీన్ ఏమయ్యాడో తెలియదు. ఈ సినిమా కోసం తన సేవలు వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారని.. ఇది నేనింతే సినిమాలో సుప్రీత్ క్యారెక్టర్ను గుర్తు చేసేలా ఉందని నెటిజన్లు అభిషేక్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 14, 2023 10:30 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…