అభిషేక్ నామా అని టాలీవుడ్లో పేరున్న నిర్మాత. ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్ను సవాల్ చేసిన వ్యక్తి ఇతను. వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ మధ్య ఈ నిర్మాత నెగెటివ్ న్యూస్లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి తనకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందని.. అభిమానులకు కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ తనకు కూడా న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభిషేక్ సంస్థ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. ఏదైనా ఉంటే నిర్మాతతో సెటిల్ చేసుకోవాలి కానీ.. ఇలా ట్విట్టర్లో హీరోను టార్గెట్ చేయడం ఏంటని అభిషేక్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్వీట్ బూమరాంగ్ అయిందన్నది స్పష్టం. ఇప్పుడు మరోసారి అభిషేక్ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు దర్శకుడిగా తన పేరే వేసుకుని పోస్టర్లు రిలీజ్ చేయడమే ఇందుక్కారణం. ముందు ఈ సినిమా నవీన్ మేడారం డైరక్షన్లో మొదలైంది. పోస్టర్ మీద రైటర్ కమ్ డైరెక్టర్గా తన పేరే ఉంది.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. దర్శకుడిగా తన పేరు తొలగించి అభిషేక్ పిక్చర్స్ టీమ్ అని వేశారు. కానీ కొత్త పోస్టర్లో ఏమో దర్శకుడిగా అభిషేక్ నామా పేరు పడిపోయింది. నవీన్ ఏమయ్యాడో తెలియదు. ఈ సినిమా కోసం తన సేవలు వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారని.. ఇది నేనింతే సినిమాలో సుప్రీత్ క్యారెక్టర్ను గుర్తు చేసేలా ఉందని నెటిజన్లు అభిషేక్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…