అభిషేక్ నామా అని టాలీవుడ్లో పేరున్న నిర్మాత. ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్ను సవాల్ చేసిన వ్యక్తి ఇతను. వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ మధ్య ఈ నిర్మాత నెగెటివ్ న్యూస్లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి తనకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందని.. అభిమానులకు కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ తనకు కూడా న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభిషేక్ సంస్థ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. ఏదైనా ఉంటే నిర్మాతతో సెటిల్ చేసుకోవాలి కానీ.. ఇలా ట్విట్టర్లో హీరోను టార్గెట్ చేయడం ఏంటని అభిషేక్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్వీట్ బూమరాంగ్ అయిందన్నది స్పష్టం. ఇప్పుడు మరోసారి అభిషేక్ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు దర్శకుడిగా తన పేరే వేసుకుని పోస్టర్లు రిలీజ్ చేయడమే ఇందుక్కారణం. ముందు ఈ సినిమా నవీన్ మేడారం డైరక్షన్లో మొదలైంది. పోస్టర్ మీద రైటర్ కమ్ డైరెక్టర్గా తన పేరే ఉంది.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. దర్శకుడిగా తన పేరు తొలగించి అభిషేక్ పిక్చర్స్ టీమ్ అని వేశారు. కానీ కొత్త పోస్టర్లో ఏమో దర్శకుడిగా అభిషేక్ నామా పేరు పడిపోయింది. నవీన్ ఏమయ్యాడో తెలియదు. ఈ సినిమా కోసం తన సేవలు వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారని.. ఇది నేనింతే సినిమాలో సుప్రీత్ క్యారెక్టర్ను గుర్తు చేసేలా ఉందని నెటిజన్లు అభిషేక్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 14, 2023 10:30 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…