అభిషేక్ నామా అని టాలీవుడ్లో పేరున్న నిర్మాత. ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్ను సవాల్ చేసిన వ్యక్తి ఇతను. వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ మధ్య ఈ నిర్మాత నెగెటివ్ న్యూస్లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి తనకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చిందని.. అభిమానులకు కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ తనకు కూడా న్యాయం చేయాలని ట్విట్టర్ వేదికగా అభిషేక్ సంస్థ హ్యాండిల్లో వేసిన ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. ఏదైనా ఉంటే నిర్మాతతో సెటిల్ చేసుకోవాలి కానీ.. ఇలా ట్విట్టర్లో హీరోను టార్గెట్ చేయడం ఏంటని అభిషేక్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్వీట్ బూమరాంగ్ అయిందన్నది స్పష్టం. ఇప్పుడు మరోసారి అభిషేక్ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు దర్శకుడిగా తన పేరే వేసుకుని పోస్టర్లు రిలీజ్ చేయడమే ఇందుక్కారణం. ముందు ఈ సినిమా నవీన్ మేడారం డైరక్షన్లో మొదలైంది. పోస్టర్ మీద రైటర్ కమ్ డైరెక్టర్గా తన పేరే ఉంది.
కానీ మధ్యలో ఏమైందో ఏమో.. దర్శకుడిగా తన పేరు తొలగించి అభిషేక్ పిక్చర్స్ టీమ్ అని వేశారు. కానీ కొత్త పోస్టర్లో ఏమో దర్శకుడిగా అభిషేక్ నామా పేరు పడిపోయింది. నవీన్ ఏమయ్యాడో తెలియదు. ఈ సినిమా కోసం తన సేవలు వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారని.. ఇది నేనింతే సినిమాలో సుప్రీత్ క్యారెక్టర్ను గుర్తు చేసేలా ఉందని నెటిజన్లు అభిషేక్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 14, 2023 10:30 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…