డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తప్ప ఇంకో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని యానిమల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి దాన్ని రన్బీర్ కపూర్ తో తెరకెక్కించి డిసెంబర్ 1 విడుదల చేయించే పనిలో ఉన్నాడు. స్వతహాగా ఇతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. చిరంజీవిని సైతం అంతే మోతాదులో విపరీతంగా ఇష్టపడతాడు. పలు ఇంటర్వ్యూలలో, ఇతని పాత ట్వీట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీళిద్దరిలో కనీసం ఒకరితో అయినా సందీప్ కాంబో పడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
గత రెండు రోజులుగా కొందరు చిరు సందీప్ కలయికలో ఒక ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందని ఆ వార్తని వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవిక కోణంలో చూస్తే దానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యానిమల్ రిలీజ్ అయ్యాక జనవరి నుంచి సందీప్ వంగా ఫ్రీ అవుతాడు. ప్రభాస్ స్పిరిట్ ని 2024 జూన్ నుంచి మొదలుపెట్టే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఆలోగా స్క్రిప్ట్ ని లాక్ చేసుకుని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకోవాలి. వేగంగా తీసే అలవాటు లేదు కాబట్టి ఎంతలేదన్నా 2025 కంటే ముందే పూర్తవ్వడం అసాధ్యం. ఆపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పనులు మొదలుపెట్టాలి.
దీనికో రెండేళ్లు వేసుకున్నా 2027 వచ్చేస్తుంది. ఇంకో ఏడాది ఎక్స్ ట్రా పట్టినా ఆశ్చర్యం లేదు. పైగా మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనే ప్లాన్ తో ఎప్పటి నుంచో తనతో టచ్ లో ఉన్నాడు సందీప్ వంగా. స్టోరీ రెడీ అయితే రాజమౌళి తర్వాత ఈ కాంబో సాధ్యపడొచ్చు. ఇంతా జరిగి 2030 దాటిపోతుంది. చిరంజీవి ఆలోగా సులభంగా ఆరేడు సినిమాలు చేసేస్తారు. పవన్ రాజకీయాల మీద ఆయన కమిట్మెంట్లు ఆధారపడి ఉంటాయి. సో ఏ కోణంలో చూసిన మెగాస్టార్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ చేతులు కలపడం దరిదాపుల్లో లేదు. ఊహించుకోవడానికి కొన్ని బాగుంటాయి కానీ అవి అమలులోకి రాలేవు.
This post was last modified on September 12, 2023 12:50 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…