కొందరు దర్శకులు నటులుగా మారి సినిమాలు చేశారు. తెలుగులో విశ్వనాథ్ గారు, దాసరి గారు నటులుగా కూడా రాణించారు. కాశీ విశ్వనాథ్ వంటి వాళ్ళు కూడా నటులుగా సెటిలయ్యారు. తరుణ్ భాస్కర్ , దేవి ప్రసాద్, వీర శంకర్ వంటి చిన్న దర్శకులు కూడా యాక్టర్స్ గా మారి బిజీ అయ్యారు. ఇక దర్శకుడు సముద్రఖని కూడా నటుడిగా తమిళ్ , తెలుగు రెండు భాషల్లో ఫుల్ బిజీ అయ్యాడు.
ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే మరో దర్శకుడు నటుడిగా మారాడు. ‘కొత్త బంగారు లోకం’తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల తాజాగా ‘పెదకాపు 1’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఓ విలన్ కేరెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో శ్రీకాంత్ అడ్డాల సీన్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు.
అణచివేతకి ఎదురుతిరిగిన కుర్రాడి కథతో విలేజ్ యాక్షన్ మూవీగా ‘పెదాకాపు 1’ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఆ పాత్ర కోసం తను ఎందుకు నటుడిగా మారాడో ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఆ పాత్రకు ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్ ను ఫైనల్ చేసుకున్నారట. తను ఆ రోల్ కి ఒకే చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి కట్ చేస్తే తను ఏమైందో షూటింగ్ రాలేదని, దాంతో మిగతా బిజీ ఆర్టిస్టుల డేట్స్ కోసం అప్పుడు తన అసోసియేట్ కిషోర్ తననే ఆ కేరెక్టర్ చేయమని అప్పటికప్పుడు ఒప్పించడాని చెప్పుకున్నాడు శ్రీకాంత్.
అలా అనుకోకుండా నటుడిగా మారాను తప్ప, తనకి నటనపై ఆసక్తి లేదని తెలిపాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తను చేసిన అప్పీరియన్స్ లు ఆ టైమ్ లో ఆ ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే తప్ప అందులో తన ప్రమేయం లేదని చెప్పాడు అడ్డాల. ఏదేమైనా శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే ఇటు దర్శకుడిగా అటు నటుడిగా సముద్రఖని తరహాలో బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడేమో మరి.
This post was last modified on September 11, 2023 10:42 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…