ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే చేస్తారు. కంటెంట్ బయటికొస్తే దాని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. తాజాగా శ్రీనువైట్ల – గోపీచంద్ కాంబో మూవీ లాంచ్ అయింది. ఈ కాంబో సినిమా పూజా కార్యక్రమాలతో ఇలా మొదలైందో లేదో నెటిజన్లు అప్పుడే ఈ ఇద్దరికీ హిట్ దక్కేనా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గోపీచంద్ తో పాటు వైట్లకి కూడా ఈ సినిమా హిట్టవ్వడం కీలకం. వరుస ఫ్లాపులతో హీరోగా గోపీచంద్ మార్కెట్ డ్రాప్ అవుతుంది.
అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ తర్వాత వైట్ల కి సినిమా సెట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. మధ్యలో విష్ణు మంచుతో డీ అండ్ డీ అంటూ డీ కి సీక్వెల్ ఏదో ప్లాన్ చేసుకున్నాడు వైట్ల. కానీ ఆ ప్రాజెక్ట్ మొదలు కాకముందే క్యాన్సిల్ అయింది. దీంతో శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ నిరూపించుకోవాల్సి ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్లాక్ బస్టర్ తో కం బ్యాక్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు తెలుగులో కనబడలేదు. మరి వైట్ల అది సాదిస్తాడా ?
చిత్రాలయం స్టూడియోస్ బేనర్ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి ఇటలీలో మొదటి షెడ్యూల్ జరుపుకోనుంది. ఇప్పటికే వైట్ల అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు. మరి గోపీచంద్ ను హిట్ ట్రాక్ లోకి తీసుకురావడంతో పాటు తను కూడా హిట్టు కొట్టడం వైట్ల ముందున్న బరువైన భాద్యత.
This post was last modified on September 9, 2023 10:27 pm
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…