కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సినిమా ‘గదర్-2’. రెండు దశాబ్దాల కిందట ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు కొనసాగింపుగా ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీశాడు దర్శక నిర్మాత అనిల్ శర్మ. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన సన్నీ డియోల్ను పెట్టి ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ తీస్తే జనాలు ఏం పట్టించుకుంటారులే అనుకున్నారు చాలామంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్నందుకుంది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తూ.. ఇండియా వరకే ఏకంగా ఐదొందల కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
రిలీజైన మూడో వారంలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది ‘గదర్-2’. ‘గదర్’ తర్వాత సన్నీకి దక్కిన హిట్ ఇదే కావడం విశేషం. తారా సింగ్గా సన్నీ పెర్ఫామెన్స్ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తారా సింగ్ పాత్ర కేవలం సన్నీ కోసమే పుట్టిందనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమయ్యాయి. కాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ కాకుండా తారా సింగ్ పాత్రను బాలీవుడ్లో ఇంకెవరు చేయగలరు అని దర్శక నిర్మాత అనిల్ శర్మను అడిగితే.. ఆయనకు ఏ ఛాయిస్ కనిపించలేదు.
బాలీవుడ్లో ఇంకెవ్వరూ తారా సింగ్ పాత్రను పోషించలేరని ఆయన తేల్చి చెప్పారు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు ఆ పాత్ర చేయగలడని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ పెర్ఫామెన్స్ చూశాక తారా సింగ్ పాత్రను తారక్ చేయగలడని అనిల్కు అనిపించి ఉండొచ్చు. ఒక భారీ బ్లాక్ బస్టర్ తీసిన వేరే ఇండస్ట్రీ డైరెక్టర్.. ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో తారక్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదీ తారక్ రేంజ్ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారు. తారక్ త్వరలోనే ‘వార్-2’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 3, 2023 8:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…