Movie News

ప్రమోషన్స్ డుమ్మాకి కారణం ఇదే !

అనుష్కకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డం ఉంది. ఆమె చేసిన బడా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమెకి ఎనలేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజ్ అనుష్క ను బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. అయితే అంతటి క్రేజ్ అందుకున్న స్వీటీ అలియాస్ ఆనుష్క చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ అదే ఫిజిక్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా టైమ్ లో కూడా ఓవర్ వెయిట్ అయిపోయింది అనుష్క. 

రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. దీంతో అనుష్క లుక్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి రీజన్ కూడా ఇదే అని తెలుస్తుంది. ఓవర్ వెయిట్ తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని చూసిన అనుష్క కి ఆ పని సాధ్యం అవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఆ రీజన్ తోనే స్వీటీ ఎక్కడా కనిపించకుండా ప్రమోషన్ లో తన మాటలు మాత్రమే వినిపిస్తుంది. 

ఇక అనుష్క యోగా టీచర్. అందులో ఆమెది అందె వేసిన చేయి. మరి యోగాతో బరువు తగ్గడం , ఆరోగ్యంగా ఉండటం చాలా సులువే. అయినా అనుష్క ఎందుకు తగ్గలేకపోయిందో ఆమెకే తెలియాలి. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో సినిమాపై హైప్ తెచ్చే భాద్యతంతా హీరో నవీన్ పైనే పడింది. తాజాగా కథవర్ అనే పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది. మరి ఆ సినిమాలో అయినా స్వీట్ స్లిమ్ లుక్ తో  దర్శనమిస్తుందా ? 

This post was last modified on September 1, 2023 12:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago