అనుష్కకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డం ఉంది. ఆమె చేసిన బడా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమెకి ఎనలేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజ్ అనుష్క ను బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. అయితే అంతటి క్రేజ్ అందుకున్న స్వీటీ అలియాస్ ఆనుష్క చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ అదే ఫిజిక్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా టైమ్ లో కూడా ఓవర్ వెయిట్ అయిపోయింది అనుష్క.
రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. దీంతో అనుష్క లుక్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి రీజన్ కూడా ఇదే అని తెలుస్తుంది. ఓవర్ వెయిట్ తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని చూసిన అనుష్క కి ఆ పని సాధ్యం అవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఆ రీజన్ తోనే స్వీటీ ఎక్కడా కనిపించకుండా ప్రమోషన్ లో తన మాటలు మాత్రమే వినిపిస్తుంది.
ఇక అనుష్క యోగా టీచర్. అందులో ఆమెది అందె వేసిన చేయి. మరి యోగాతో బరువు తగ్గడం , ఆరోగ్యంగా ఉండటం చాలా సులువే. అయినా అనుష్క ఎందుకు తగ్గలేకపోయిందో ఆమెకే తెలియాలి. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో సినిమాపై హైప్ తెచ్చే భాద్యతంతా హీరో నవీన్ పైనే పడింది. తాజాగా కథవర్ అనే పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది. మరి ఆ సినిమాలో అయినా స్వీట్ స్లిమ్ లుక్ తో దర్శనమిస్తుందా ?
This post was last modified on September 1, 2023 12:56 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…