అనుష్కకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డం ఉంది. ఆమె చేసిన బడా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమెకి ఎనలేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజ్ అనుష్క ను బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. అయితే అంతటి క్రేజ్ అందుకున్న స్వీటీ అలియాస్ ఆనుష్క చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ అదే ఫిజిక్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా టైమ్ లో కూడా ఓవర్ వెయిట్ అయిపోయింది అనుష్క.
రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. దీంతో అనుష్క లుక్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి రీజన్ కూడా ఇదే అని తెలుస్తుంది. ఓవర్ వెయిట్ తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని చూసిన అనుష్క కి ఆ పని సాధ్యం అవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఆ రీజన్ తోనే స్వీటీ ఎక్కడా కనిపించకుండా ప్రమోషన్ లో తన మాటలు మాత్రమే వినిపిస్తుంది.
ఇక అనుష్క యోగా టీచర్. అందులో ఆమెది అందె వేసిన చేయి. మరి యోగాతో బరువు తగ్గడం , ఆరోగ్యంగా ఉండటం చాలా సులువే. అయినా అనుష్క ఎందుకు తగ్గలేకపోయిందో ఆమెకే తెలియాలి. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో సినిమాపై హైప్ తెచ్చే భాద్యతంతా హీరో నవీన్ పైనే పడింది. తాజాగా కథవర్ అనే పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది. మరి ఆ సినిమాలో అయినా స్వీట్ స్లిమ్ లుక్ తో దర్శనమిస్తుందా ?
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…