అన్ని ఇండస్ట్రీలలోనూ జాతీయ అవార్డులకు సంబంధించిన వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. పూర్తి ఆధిపత్యం సాధించిన టాలీవుడ్ వర్గాలు సంతోషంలో మునిగి తేలుతుండగా తమకు ఎందుకు మిస్ అయ్యిందనే కోణంలో ఇతరులు విశ్లేషణ చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన సినిమా జై భీమ్. సామజిక రుగ్మతలు, అన్యాయాల మీద దర్శకుడు టీజె జ్ఞానవేల్ రూపొందించిన ఈ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నప్పటికీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కించుకుని అందరితో శభాష్ అనిపించుకుంది.
ఊహించని విధంగా జై భీమ్ ఏ విభాగంలోనూ చోటు దక్కించుకోలేదు. అల్లు అర్జున్ సంపూర్ణంగా అర్హుడే అయినప్పటికీ సూర్య కూడా సరైన హక్కుదారుడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇక్కడో కోణం ఆలోచించాలి. 2020లో సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)కు గాను ఆ ఏడాది సూర్య ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. తిరిగి అదే సంస్థ నుంచి వచ్చిందే జై భీమ్. వరుసగా రెండుసార్లు ఒకే యాక్టర్ కి ఇచ్చిన దాఖలాలు గతంలో పెద్దగా లేవు. పైగా పుష్పలో బన్నీకి వచ్చినంత పాపులారిటీ సూర్యకి తాను చేసిన మూవీ నుంచి రాలేదన్నది వాస్తవం. ఈ లాజిక్ మిస్ కాకూడదు.
ఇలా చూసుకుంటే ఎన్నో సినిమాలు, నటీనటులు తృటిలో మిస్ చేసుకున్న దాఖలాలు గతంలో, వర్తమానంలో ఎన్నో ఉన్నాయి. అలాంటిది కేవలం జై భీమ్ కి ఏదో వివక్ష జరిగిందనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతేనేం దక్షిణాది పరిశ్రమగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం అన్నీ ఒకే తాటిపై ఉంటూ ఒక్కటిగా సాగుతున్న టైంలో వీటిని విడివిడిగా చూడలేం కాబట్టి ఎవరికి వచ్చినా ఒకేలా భావించాలి. కోలీవుడ్ కు చెందిన మాధవన్ తీసిన రాకెట్రి ది నంబికి ఉత్తమ చిత్రంగా సముచిత గౌరవం దక్కింది కాబట్టి హెచ్చు తగ్గుల గురించి చర్చలు అనవసరమనే చెప్పాలి. కానీ సోషల్ మీడియా ఊరుకోదుగా.
This post was last modified on August 25, 2023 8:02 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…