కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదం జరిగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం విజయవాడలో ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్లో సైతం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఇలాగే కరోనా చికిత్స కోసం వెళ్తుంటే జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాంతం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి టాలీవుడ్ నిర్మాత కావడం గమనార్హం. ఆయన పేరు.. కమలాకర్ రెడ్డి. ఆయన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ తెలుగు వెర్షన్కు నిర్మాత. ఆయనది నెల్లూరు జిల్లా.
కమలాకర్ తండ్రి కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్కు తరలించాల్సి వచ్చింది. దీంతో అంబులెన్సు మాట్లాడుకుని తండ్రితో కలిసి కమలాకర్రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరాడు. ఐతే మార్గ మధ్యంలో భారీ వర్షం కారణంగా అంబులెన్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కమలాకర్రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా నుంచి తండ్రిని కాపాడుకుందామనుకుంటే.. ఇలా ఆయనతో పాటు కమలాకర్ కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదం. లాక్డౌన్ ముంగిట విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆర్థికంగా మంచి లాభాలే అందుకున్నారు కమలాకర్ రెడ్డి.
This post was last modified on August 19, 2020 8:26 pm
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…