కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదం జరిగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం విజయవాడలో ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్లో సైతం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఇలాగే కరోనా చికిత్స కోసం వెళ్తుంటే జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాంతం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి టాలీవుడ్ నిర్మాత కావడం గమనార్హం. ఆయన పేరు.. కమలాకర్ రెడ్డి. ఆయన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ తెలుగు వెర్షన్కు నిర్మాత. ఆయనది నెల్లూరు జిల్లా.
కమలాకర్ తండ్రి కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్కు తరలించాల్సి వచ్చింది. దీంతో అంబులెన్సు మాట్లాడుకుని తండ్రితో కలిసి కమలాకర్రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరాడు. ఐతే మార్గ మధ్యంలో భారీ వర్షం కారణంగా అంబులెన్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కమలాకర్రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా నుంచి తండ్రిని కాపాడుకుందామనుకుంటే.. ఇలా ఆయనతో పాటు కమలాకర్ కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదం. లాక్డౌన్ ముంగిట విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆర్థికంగా మంచి లాభాలే అందుకున్నారు కమలాకర్ రెడ్డి.
This post was last modified on August 19, 2020 8:26 pm
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…