Movie News

కన్నీళ్లు తెప్పిస్తున్న టాలీవుడ్ నిర్మాత విషాదాంతం

కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదం జరిగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం విజయవాడలో ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సైతం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఇలాగే కరోనా చికిత్స కోసం వెళ్తుంటే జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాంతం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి టాలీవుడ్ నిర్మాత కావడం గమనార్హం. ఆయన పేరు.. కమలాకర్ రెడ్డి. ఆయన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ తెలుగు వెర్షన్‌కు నిర్మాత. ఆయనది నెల్లూరు జిల్లా.

కమలాకర్ తండ్రి కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది. దీంతో అంబులెన్సు మాట్లాడుకుని తండ్రితో కలిసి కమలాకర్‌రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరాడు. ఐతే మార్గ మధ్యంలో భారీ వర్షం కారణంగా అంబులెన్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా నుంచి తండ్రిని కాపాడుకుందామనుకుంటే.. ఇలా ఆయనతో పాటు కమలాకర్ కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదం. లాక్‌డౌన్ ముంగిట విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆర్థికంగా మంచి లాభాలే అందుకున్నారు కమలాకర్‌ రెడ్డి.

This post was last modified on August 19, 2020 8:26 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

వేల కోట్లు ఉన్నా కష్టాన్నే నమ్ముకున్న వారసుడు

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్లలో సచిన్ ఒకరు. వేల కోట్ల ఆస్తి. ఇక అతనికి వారసుడిగా అర్జున్ హ్యాపీగా లైఫ్…

16 minutes ago

క‌ల్ట్ మూవీకి సీక్వెల్… వ‌ర్క‌వుటవుతుందా?

బాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలు, పాత్ర‌లు చేసుకుంటున్న కంగ‌నా ర‌నౌత్‌ను పెద్ద స్టార్‌గా మార్చిన సినిమా.. క్వీన్. ఇండియ‌న్ ఫిలిం…

52 minutes ago

పెద్దిపై నోరు విప్ప‌ని మృణాల్‌

ఓ భారీ చిత్రంలో కాస్టింగ్‌కు సంబంధించి ఆ సినిమా బృంద‌మే అధికారిక ప్ర‌క‌ట‌న చేయాలి త‌ప్ప‌.. అది జ‌ర‌గ‌క ముందు…

2 hours ago

జ‌గ‌న్ డ‌బ్బును చూస్తే.. బాబు భ‌విష్య‌త్తు చూస్తున్నారు..!

సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది ``డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.`` అని. ఇక‌,…

4 hours ago

స్థ‌లం కొని మ‌రిచిపోయిన పూరి జ‌గ‌న్నాథ్‌

ఫిలిం సెల‌బ్రెటీల్లో చాలామంది ఇండ‌స్ట్రీలో సంపాదించే డ‌బ్బుల‌ను భూమి మీద పెట్టుబ‌డిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబ‌డులు పెట్టిన…

4 hours ago

ఊపిరి పీల్చుకున్న గులాబీ

అసెంబ్లీ నుంచి పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు.. తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తిన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు .. తాజాగా రెండు మునిసిప‌ల్ చైర్మ‌న్…

8 hours ago