మాములుగా విజయ్ దేవరకొండ ఏదైనా ఈవెంట్ లేదా తన సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్లలో ఇతర హీరోల ప్రస్తావన రాకుండా చూసుకుంటాడు. కానీ సీనియర్ల విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇచ్చేశారు. ఖుషి ప్రమోషన్ల కోసం తమిళనాడు, కేరళ ట్రిప్ కు వెళ్లిన రౌడీ హీరోకు అక్కడ చిరంజీవి, రజనీకాంత్ ల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆరేడు వరస ఫ్లాపులు వచ్చినా వాళ్ళ స్టార్ డం చెక్కు చెదరదని, ఎన్నో చూసిన శిఖరాలు కాబట్టే కేవలం సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి అంచనా వేయడం ఎంత మాత్రం సరికాదని చాలా స్పష్టంగా వివరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా భోళా శంకర్ డిజాస్టర్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మెగాస్టార్ గురించి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా గమనం మారిందని, అప్పటి దాకా ఒక లెక్కలో ఉన్న పరిశ్రమ వేగం ఇంకో స్థాయికి వెళ్లిందని, అంతే తప్ప కేవలం ఫలితాల ఆధారంగా వాళ్ళ స్థాయిని నిర్ణయించడం తగదని హితవు పలికాడు. జైలర్ 500 కోట్లు వసూలు చేసినప్పుడు అందరూ నోరు మూసుకుని చూశామని అది వాళ్ళ స్టామినా అని పొగడ్తల వర్షం కురిపించడం చూసి తమిళ తెలుగు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రౌడీ హీరో చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఖుషి గురించి కాకుండా ఇతర ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా ఇది సబ్జెక్టు కాదు, సందర్భం కాదు అని తప్పించుకోవడం లేదు. సెప్టెంబర్ 1 విడుదల కాబోతున్న ఖుషి పబ్లిసిటీ విషయంలో భారం మొత్తం విజయ్ మీదే పడింది. ఆరోగ్య రిత్యా సమంతా మళ్ళీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే మ్యూజికల్ కన్సర్ట్ కి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి యుఎస్ వెళ్లిపోయింది. ఇప్పుడు అన్ని బాషల ఈవెంట్లు, ప్రెస్ మీట్లు విజయ్ దేవరకొండనే చూసుకోవాలి. హేశం వహాబ్, శివ నిర్వాణలు ఫైనల్ కాపీ పనుల్లో బిజీగా ఉన్నారు.
This post was last modified on August 22, 2023 11:45 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…