Movie News

చిరు రజని స్థాయి గురించి విజయ్ దేవరకొండ

మాములుగా విజయ్ దేవరకొండ  ఏదైనా ఈవెంట్ లేదా తన సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్లలో ఇతర హీరోల ప్రస్తావన రాకుండా చూసుకుంటాడు. కానీ సీనియర్ల విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇచ్చేశారు. ఖుషి ప్రమోషన్ల కోసం తమిళనాడు, కేరళ ట్రిప్ కు వెళ్లిన రౌడీ హీరోకు అక్కడ చిరంజీవి, రజనీకాంత్ ల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆరేడు వరస ఫ్లాపులు వచ్చినా వాళ్ళ స్టార్ డం చెక్కు చెదరదని, ఎన్నో చూసిన శిఖరాలు కాబట్టే కేవలం సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి అంచనా వేయడం ఎంత మాత్రం సరికాదని చాలా స్పష్టంగా వివరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

ముఖ్యంగా భోళా శంకర్ డిజాస్టర్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మెగాస్టార్ గురించి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా గమనం మారిందని, అప్పటి దాకా ఒక లెక్కలో ఉన్న పరిశ్రమ వేగం ఇంకో స్థాయికి వెళ్లిందని, అంతే తప్ప కేవలం ఫలితాల ఆధారంగా వాళ్ళ స్థాయిని నిర్ణయించడం తగదని హితవు పలికాడు. జైలర్ 500 కోట్లు వసూలు చేసినప్పుడు అందరూ నోరు మూసుకుని చూశామని అది వాళ్ళ స్టామినా అని పొగడ్తల వర్షం కురిపించడం చూసి తమిళ తెలుగు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి రౌడీ హీరో చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఖుషి గురించి కాకుండా ఇతర ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా ఇది సబ్జెక్టు కాదు, సందర్భం కాదు అని తప్పించుకోవడం లేదు. సెప్టెంబర్ 1 విడుదల కాబోతున్న ఖుషి పబ్లిసిటీ విషయంలో భారం మొత్తం విజయ్ మీదే పడింది. ఆరోగ్య రిత్యా సమంతా మళ్ళీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే మ్యూజికల్ కన్సర్ట్  కి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి యుఎస్ వెళ్లిపోయింది. ఇప్పుడు అన్ని బాషల ఈవెంట్లు, ప్రెస్ మీట్లు విజయ్ దేవరకొండనే చూసుకోవాలి. హేశం వహాబ్, శివ నిర్వాణలు ఫైనల్ కాపీ పనుల్లో బిజీగా ఉన్నారు.

This post was last modified on August 22, 2023 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago