ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్లో రెండు సినిమాలదే హవా. దక్షిణాదిన అంతటా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ వసూళ్ల మోత మోగిస్తుంటే.. ఉత్తరాదిన గదర్-2 కలెక్షన్లు కుమ్మేస్తోంది. చాలా ఏళ్లుగా అసలేమాత్రం లైమ్ లైట్లో లేని సన్నీ డియోల్ హీరోగా.. 20 ఏళ్ల కిందటి గదర్ సినిమాకు సీక్వెల్ తీస్తే జనం విరగబడి చూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది.
ఉత్తరాదిన మాస్ ఏరియాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సక్సెస్తో సన్నీ మామూలు ఆనందంలో లేడు. కానీ ఈ ఆనందంలో అతను లగాన్ లాంటి మైల్ స్టోన్ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఒకప్పుడు గదర్, లగాన్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కంటెంట్ పరంగా లగాన్యే గొప్ప సినిమా అయినా… కలెక్షన్లలో గదర్యే పైచేయి సాధించింది.
అప్పట్లో లగాన్ రూ.70 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా.. గదర్ రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ.. లగాన్ మంచి సినిమా అంటూనే తన గదర్ సినిమాతో పోలిస్తే అది 2 నుంచి 5 శాతం బిజినెస్ మాత్రమే చేసిందని పేర్కొనడం గమనార్హం. గదర్కు, లగాన్కు పోలిక పెట్టడం తనకు నచ్చదని… తాను పోటీ గురించి అసలు పట్టించుకోనని సన్నీ అన్నాడు.
కొన్ని సినిమాల్లో స్టార్ కాస్టింగ్ పెట్టుకుని.. ప్రమోషన్ల విషయంలో బాగా హడావుడి చేస్తారని.. కానీ తాను అలాంటివి అస్సలు నమ్మనని సన్నీ అన్నాడు. అప్పుడు లగాన్ మీద గదర్ పైచేయి సాధించగా.. ఇప్పుడు ఓఎంజీ-2ను వెనక్కి నెట్టి గదర్-2 భారీ విజయం సాధించింది. ఓఎంజీ-2 వసూళ్లు రూ.90 కోట్లకు చేరువగా ఉండగా.. దానికంటే 3 రెట్లకు పైగా గదర్-2 కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే పోటీ గురించి మాట్లాడుతూ.. లగాన్ మూవీని మరీ తక్కువ చేసి మాట్లాడాడు సన్నీ.
This post was last modified on August 20, 2023 1:58 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…