Movie News

ఛోటా టెక్నీషియన్‌కు మెగా ఆఫర్

మంగళవారం ఉదయం ప్రభాస్ కొత్త సినిమా ‘ఆది పురుష్’ ప్రకటించినప్పటి నుంచి.. ఆ సినిమా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ట్విట్టర్లో ట్రెండ్స్ అన్నీ ఆ సినిమా గురించే కనిపిస్తున్నాయి. ‘రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’కి దర్శకుడైన ఓమ్ రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయి. రూ.300 కోట్లతో మొదలుపెట్టి రూ.500 కోట్ల దాకా చెబుతున్నారు బడ్జెట్ లెక్కలు. ‘బాహుబలి’ని మించిన భారీతనంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరికీ ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే. ఇందులో ముఖ్య పాత్రలు పోషించబోయే మిగతా నటీనటుల గురించి ఇంకా ఏ వివరాలు వెల్లడి కాలేదు.

ఐతే ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా మాత్రం కార్తీక్ పళని పేరు వినిపిస్తోంది. ఈ టెక్నీషియన్ ఇప్పటిదాకా చిన్నా చితకా చిత్రాలే చేశాడు. వాటిలో ఏదీ ఐదు కోట్ల బడ్జెట్‌ను మించింది లేదు. తెలుగులో బ్రాండ్ బాబు, నెక్స్ట్ నువ్వే లాంటి చిన్న చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు కార్తీక్. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఛాయాగ్రాహకుడు తిరు దగ్గర అతను శిష్యరికం చేశాడు. ఐతే కార్తీక్ చివరగా పని చేసిన ‘పెంగ్విన్’ సినిమాకు సంబంధించి మిగతా విషయాలన్నీ ప్రేక్షకులను నిరాశకు గురి చేసినప్పటికీ అందులో ఛాయాగ్రహణం మాత్రం హైలైట్ అయింది. కోడైకెనాల్ అందాల్ని భలేగా ఎలివేట్ చేశాడతను.

సినిమా చూసిన వాళ్లందరూ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో పనితనం, కార్తీక్ పనితనం గురించి ఉన్న ఫీడ్ బ్యాక్‌తో ‘ఆదిపురుష్’ ఛాయాగ్రహణ బాధ్యతల్ని అతడికే అప్పగించినట్లు చెబుతున్నారు. అత చిన్న సినిమాలకు పని చేసి ఒకేసారి ఇంత భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం అంటే మాటలా?

This post was last modified on August 19, 2020 1:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago