Movie News

ఛోటా టెక్నీషియన్‌కు మెగా ఆఫర్

మంగళవారం ఉదయం ప్రభాస్ కొత్త సినిమా ‘ఆది పురుష్’ ప్రకటించినప్పటి నుంచి.. ఆ సినిమా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ట్విట్టర్లో ట్రెండ్స్ అన్నీ ఆ సినిమా గురించే కనిపిస్తున్నాయి. ‘రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’కి దర్శకుడైన ఓమ్ రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయి. రూ.300 కోట్లతో మొదలుపెట్టి రూ.500 కోట్ల దాకా చెబుతున్నారు బడ్జెట్ లెక్కలు. ‘బాహుబలి’ని మించిన భారీతనంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరికీ ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే. ఇందులో ముఖ్య పాత్రలు పోషించబోయే మిగతా నటీనటుల గురించి ఇంకా ఏ వివరాలు వెల్లడి కాలేదు.

ఐతే ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా మాత్రం కార్తీక్ పళని పేరు వినిపిస్తోంది. ఈ టెక్నీషియన్ ఇప్పటిదాకా చిన్నా చితకా చిత్రాలే చేశాడు. వాటిలో ఏదీ ఐదు కోట్ల బడ్జెట్‌ను మించింది లేదు. తెలుగులో బ్రాండ్ బాబు, నెక్స్ట్ నువ్వే లాంటి చిన్న చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు కార్తీక్. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఛాయాగ్రాహకుడు తిరు దగ్గర అతను శిష్యరికం చేశాడు. ఐతే కార్తీక్ చివరగా పని చేసిన ‘పెంగ్విన్’ సినిమాకు సంబంధించి మిగతా విషయాలన్నీ ప్రేక్షకులను నిరాశకు గురి చేసినప్పటికీ అందులో ఛాయాగ్రహణం మాత్రం హైలైట్ అయింది. కోడైకెనాల్ అందాల్ని భలేగా ఎలివేట్ చేశాడతను.

సినిమా చూసిన వాళ్లందరూ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో పనితనం, కార్తీక్ పనితనం గురించి ఉన్న ఫీడ్ బ్యాక్‌తో ‘ఆదిపురుష్’ ఛాయాగ్రహణ బాధ్యతల్ని అతడికే అప్పగించినట్లు చెబుతున్నారు. అత చిన్న సినిమాలకు పని చేసి ఒకేసారి ఇంత భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం అంటే మాటలా?

This post was last modified on August 19, 2020 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago