ఏది ఏమైనా భోళా శంకర్ ఫలితం తేలిపోయింది. కాస్తో కూస్తో ఆశలున్న మొన్నటి వీకెండ్, ఇవాళ్టి ఇండిపెండెన్స్ డే రెండూ నిరాశ కలిగించే వసూళ్లు నమోదు చేయడంతో ఇక ఎదురు చూసేందుకు ఏమీ లేకపోయింది. ఎంత నష్టం మిగులుతుందనే లెక్కలు బయ్యర్లని భయపెడుతున్నాయి. సరే కలెక్షన్ల సంగతి పక్కనపెడితే ఈ మెగా మూవీ రీమేక్ విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఒకరకంగా కరెక్టే అయినా స్క్రిప్ట్ అండ్ స్టోరీపరంగా చేసిన రెండు కీలక తప్పులు చాలా ప్రభావం చూపించాయన్న వాస్తవాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. రెండు వెర్షన్లు చూసిన వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే.
వేదాళం ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ కు చెల్లిగా నటించిన అమ్మాయి లక్ష్మి మీనన్. డీ గ్లామర్ లుక్ తో నటనే బలంగా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన టైంలో ఈ అవకాశం తనకు చాలా ఉపయోగపడింది. కానీ మనదగ్గరకు వచ్చేసరికి ఇటు గ్లామర్ అటు ఫిమేల్ ఓరియెంటెడ్ రెండూ చేస్తున్న కీర్త్ సురేష్ ని తీసుకోవడంతో ప్రేక్షకుల మనసులో సానుభూతి ఏర్పడలేదు. పైగా మేకప్, కాస్ట్యూమ్స్ గట్రా రిచ్ గా పెట్టారు. వేదాళంలో లక్ష్మి తల్లితండ్రులకు చూపు ఉండదు. నోటెడ్ ఆర్టిస్టులను పెట్టలేదు. ఆ సింపతీ ఎమోషన్ల పరంగా ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేసింది.
తీరా మనదగ్గర చూస్తే మురళీశర్మ జంటగా రిచ్ క్యాస్టింగ్ ని పెట్టుకున్నారు. కట్టు బొట్టు అన్నీ ఎగువ మధ్య తరగతి అనేలా చూపించారు. దీంతో సహజంగానే ఎంత అమాయకంగా నటించినా ఈ పాయింట్ సరిగా రిజిస్టర్ కాలేదు. ఈ కుటుంబానికి అండగా అజిత్ నిలవడం అక్కడ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయితే తెలుగులో మాత్రం పై రెండు కారాణాల వల్ల తేడా కొట్టింది. పైగా భోళా చుట్టూ జబర్దస్త్ గ్యాంగుతో పెట్టిన అత్తెసరు జోకులు మరింత డ్యామేజ్ చేశాయి. నలుగురు అనుభవమున్న రచయితలు ఈ అంశాల మీద సీరియస్ గా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చిన ముప్పిది.
This post was last modified on August 15, 2023 7:09 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…