బాలీవుడ్ మూవీ మాఫియా మీద అలుపెరగని పోరాటం చేస్తోంది కంగనా రనౌత్. కొన్నిసార్లు తన మద్దతుదారులకు కూడా అసహనం కలిగేలా కంగనా ప్రవర్తిస్తుంటుందనేది వాస్తవం. కానీ ఎవరేమన్నా ఆమె వెనక్కి తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ను నెత్తిన పెట్టుకుని వాళ్లతోనే సినిమాలు చేసే, వాళ్లను అనేక రకాలుగా ప్రమోట్ చేసే కరణ్ జోహార్ అంటే ఆమెకు మామూలు మంట కాదు. ఇప్పటికి కరణ్ను ఎన్నిసార్లు తిట్టిపోసిందో.. అతడిపై ఎన్ని ఆరోపణలు చేసిందో లెక్కే లేదు. తాజాగా ఆమె మరోసారి కరణ్ను టార్గెట్ చేసింది. కరణ్కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం.
తనను బెదిరించడమే కాక.. యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి కరణ్ కారకుడయ్యాడని.. ఇంకా అనేక ప్రతికూల కారణాలున్నాయని.. అందుకే కరణ్కు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. ‘‘భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం దయచేసి కరణ్ జోహార్కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోకండి. అందుకు ఆయన అర్హుడు కాదు. ఆయన నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని బెదిరించారు. సుశాంత్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం. అంతే కాదు.. పాకిస్థాన్కు అనుకూలంగా, మన భద్రతా దళాలను కించపరిచేలా జాతి వ్యతిరేక సినిమాలు కూడా తీశారు’’ అని కంగనా తాజాగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. కథానాయికగా నిలదొక్కుకోవడానికి ముందు తనను ఇబ్బంది పెట్టిన బాలీవుడ్ బడాబాబులందరినీ కంగనా కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…