Movie News

నన్ను బెదిరించాడు.. కరణ్ పద్మశ్మీని వెనక్కి తీస్కోండి

బాలీవుడ్ మూవీ మాఫియా మీద అలుపెరగని పోరాటం చేస్తోంది కంగనా రనౌత్. కొన్నిసార్లు తన మద్దతుదారులకు కూడా అసహనం కలిగేలా కంగనా ప్రవర్తిస్తుంటుందనేది వాస్తవం. కానీ ఎవరేమన్నా ఆమె వెనక్కి తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్‌ను నెత్తిన పెట్టుకుని వాళ్లతోనే సినిమాలు చేసే, వాళ్లను అనేక రకాలుగా ప్రమోట్ చేసే కరణ్ జోహార్ అంటే ఆమెకు మామూలు మంట కాదు. ఇప్పటికి కరణ్‌ను ఎన్నిసార్లు తిట్టిపోసిందో.. అతడిపై ఎన్ని ఆరోపణలు చేసిందో లెక్కే లేదు. తాజాగా ఆమె మరోసారి కరణ్‌ను టార్గెట్ చేసింది. కరణ్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం.

తనను బెదిరించడమే కాక.. యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి కరణ్ కారకుడయ్యాడని.. ఇంకా అనేక ప్రతికూల కారణాలున్నాయని.. అందుకే కరణ్‌కు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. ‘‘భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం దయచేసి కరణ్ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోకండి. అందుకు ఆయన అర్హుడు కాదు. ఆయన నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని బెదిరించారు. సుశాంత్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం. అంతే కాదు.. పాకిస్థాన్‌కు అనుకూలంగా, మన భద్రతా దళాలను కించపరిచేలా జాతి వ్యతిరేక సినిమాలు కూడా తీశారు’’ అని కంగనా తాజాగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. కథానాయికగా నిలదొక్కుకోవడానికి ముందు తనను ఇబ్బంది పెట్టిన బాలీవుడ్ బడాబాబులందరినీ కంగనా కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 18, 2020 7:51 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

48 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago