సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, వసూళ్ల పరంగా ఆయన ఎవ్వరూ అందుకోలేని ఎత్తులకు వెళ్లారు. ఐతే సినిమాల్లో ఎంత సాధించినా.. బయట మాత్రం ఆయన ఎంత వినమ్రంగా ఉంటారో తెలిసిందే. ఏమాత్రం అహంకారం లేకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం జనాల్లో మరింత అభిమానం పెంచింది.
ఓవైపు ‘జైలర్’ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంటే.. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేయకుండా హిమాలయాల పర్యటనకు వెళ్లిపోవడం రజినీకే చెల్లింది. అక్కడ ఆయన అతి సామాన్యుడిలా ఉండటానికి ప్రయత్నిస్తారన్న సంగతి తెలిసిందే. తన సినిమాల షూటింగ్ స్పాట్లోనూ రజినీ మెలిగే తీరు గురించి కథలు కథలుగా చెబుతుంటారు సినీ జనాలు. తాజాగా రజినీ గొప్పదనాన్ని చాటే ఒక ఉదంతం బయటికి వచ్చింది.
‘జైలర్’ షూటింగ్ సందర్భంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే జైల్ ఎపిసోడ్ కోసం ఒక జూనియర్ ఆర్టిస్టును తీసుకొచ్చారట. ఐతే షూట్ టైంలో అతడి పెర్ఫామెన్స్ ఎవ్వరికీ నచ్చలేదట. అతడి వల్ల సీన్ డిస్టర్బ్ అవుతోందని పక్కన పెట్టేశారట. ఐతే షాట్ గ్యాప్లో రజినీ ఈ విషయం గమనించి.. ఆ జూనియర్ ఆర్టిస్ట్ గురించి బాధపడ్డారట.
రజినీతో నటిస్తున్నా అని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పి వచ్చి ఉంటాడు.. ఇప్పుడు మనం తీసేస్తే అతడికి ఇబ్బంది కదా అని చెప్పి.. తర్వాతి సీన్లోకి అతణ్ని తీసుకోమని చెప్పి.. అతను నటించే అవసరం లేకుండానే.. ఊరికే ఆ నటుడి భుజం మీద చేయి వాల్చి డైలాగ్ చెప్పేలా సీన్లో చిన్న మార్పు చేయించారట సూపర్ స్టార్. ఈ విషయాన్ని ‘జైలర్’ ఆడియో వేడుకలోనే టీంలోని ఒక వ్యక్తి స్టేజ్ మీద చాలా ఎమోషనల్ అవుతూ వెల్లడించాడు. ఇప్పుడు సినిమాలో సదరు సన్నివేశంలో ఆ జూనియర్ ఆర్టిస్ట్ను ఐడెంటిఫై చేసిన నెటిజన్లు.. ఆ స్పీచ్ వీడియోకు, ఈ ఫొటోను జోడించి దటీజ్ రజినీ అంటూ ఆయన గొప్పదనాన్ని కొనియాడుతున్నారు.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…